Revanth Reddy: మోదీ చదువుకోక పోవడంతోనే ఇలాంటి నిర్ణయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాన మంత్రి మోదీ పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీకి, మోదీకి ఆర్మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదని.. బుర్ర అప్లై చేయడం లేదని విమర్శించారు. అన్నింటిని గందరగోళం చేసి తప్పుదోవ పట్టించడం బీజేపీ నేతలకు అలవాటని ఆయన ఎద్దేవా చేశారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్మీ ఎవరు ఏం చేస్తారో, ఎలాంటి విధులు నిర్వహిస్తారో బీజేపీ నేతలకు తెలియదని ఆయన అన్నారు. ఇతర దేశాలు దాడులు చేస్తే అప్పుడు జవాన్లను వాడుతారని.. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు రంగంలోకి దిగుతారని రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగేళ్లు ఆయుధాలు వాడటం ఎలాా అని నేర్పి బయటకు పంపితే ఏం చేస్తారని అగ్నిపథ్ పథకంపై కేంద్రాన్ని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అగ్నిపథ్ ను మోదీ ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.
అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్ర మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. కిషన్ రెడ్డి బట్టలు ఉతకడానికి అని.. మరో బీజేపీ నేత బీజేపీ కార్యాలయాల ముందు సెక్యురిటీ గార్డ్ ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారని.. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాల్పులు జరిగిప ఓ యువకుడి మరణానికి కారణం అయిందని.. మళ్లీ అంతిమ యాత్ర కూడా నిర్వహించిందని విమర్శించారు. యువకులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని.. టీఆర్ఎస్ పరోక్షంగా అగ్నిపథ్ కు మద్దతు ఇస్తుందని.. సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!