SBI ATM Robbery: రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం చోరీపై కొనసాగుతున్న దర్యాప్తు..
- రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై కొనసాగుతున్న విచారణ..
- నిందితులను పట్టుకోవడానికి 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్న పోలీసులు..
- ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై విచారణ కొనసాగుతుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్నారు. దుండగులు కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్టు గుర్తించారు.. ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత భద్రత వ్యవస్థలు ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారు.. ఏటీఎంలో చోరీ అనంతరం ముంబై వైపు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. మార్చ్ ఒకటిన కర్ణాటకలోని హోస్కోటేలో ఇదే తరహా దోపిడీ జరిగినట్లు తెలుస్తుంది. రావిరాలలో దోపిడీ ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి 30 లక్షల రూపాయలు చోరీ చేసినట్లు సమాచారం వచ్చింది. కర్ణాటక చోరీలో ఏపీ నెంబర్ ప్లేట్ వినియోగించిన దుండగులు.. రావిర్యాలలోని ఏటీఎం, కర్ణాటకలోని ఏటీఎంలో ఒకే తరహా దోపిడి విధానం పాటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కర్ణాటక పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు రాచకొండ పోలీసులు.
Read Also: Nara Lokesh: మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత మాది!
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
కాగా, హైదరాబాద్ శివారు ప్రాంతంలో వరస ఏటీఎంల చోరీకి పాల్పడుతున్నారు. శనివారం రాత్రి రెండు ప్రాంతాలలో ఏటీఎంలో చోరీకి పాల్పడిన ముఠాలు.. రావిర్యాల గ్రామంలో గ్యాస్ కట్టర్ సహాయంతో నాలుగు నిమిషాల్లో చోరీ చేసిన దొంగలు.. సుమారు 30 లక్షల రూపాయల నగదుతో ఉడాయించారు. అలాగే, అదే రోజు రాత్రి మైలార్ దేవులపల్లిలోని మధుబన్ కాలనీలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు. ఏటీఎం మెషిన్ ఓపెన్ కాకపోవడంతో ఏటీఎం మిషన్ ని తగలబెట్టారు. వరుస చోరీలతో ఏటీఎం సెంటర్లలో భద్రత కరువైంది.
- Tags
- ATM
- hyderabad
- police
- Rangareddy
- Ravirala
తాజావార్తలు
-
Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!