SBI ATM Robbery: రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం చోరీపై కొనసాగుతున్న దర్యాప్తు..
- రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై కొనసాగుతున్న విచారణ..
- నిందితులను పట్టుకోవడానికి 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్న పోలీసులు..
- ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై విచారణ కొనసాగుతుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్నారు. దుండగులు కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్టు గుర్తించారు.. ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత భద్రత వ్యవస్థలు ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారు.. ఏటీఎంలో చోరీ అనంతరం ముంబై వైపు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. మార్చ్ ఒకటిన కర్ణాటకలోని హోస్కోటేలో ఇదే తరహా దోపిడీ జరిగినట్లు తెలుస్తుంది. రావిరాలలో దోపిడీ ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి 30 లక్షల రూపాయలు చోరీ చేసినట్లు సమాచారం వచ్చింది. కర్ణాటక చోరీలో ఏపీ నెంబర్ ప్లేట్ వినియోగించిన దుండగులు.. రావిర్యాలలోని ఏటీఎం, కర్ణాటకలోని ఏటీఎంలో ఒకే తరహా దోపిడి విధానం పాటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కర్ణాటక పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు రాచకొండ పోలీసులు.
Read Also: Nara Lokesh: మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత మాది!
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
కాగా, హైదరాబాద్ శివారు ప్రాంతంలో వరస ఏటీఎంల చోరీకి పాల్పడుతున్నారు. శనివారం రాత్రి రెండు ప్రాంతాలలో ఏటీఎంలో చోరీకి పాల్పడిన ముఠాలు.. రావిర్యాల గ్రామంలో గ్యాస్ కట్టర్ సహాయంతో నాలుగు నిమిషాల్లో చోరీ చేసిన దొంగలు.. సుమారు 30 లక్షల రూపాయల నగదుతో ఉడాయించారు. అలాగే, అదే రోజు రాత్రి మైలార్ దేవులపల్లిలోని మధుబన్ కాలనీలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు. ఏటీఎం మెషిన్ ఓపెన్ కాకపోవడంతో ఏటీఎం మిషన్ ని తగలబెట్టారు. వరుస చోరీలతో ఏటీఎం సెంటర్లలో భద్రత కరువైంది.
- Tags
- ATM
- hyderabad
- police
- Rangareddy
- Ravirala
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!