రేపు తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటించనున్నారు. అలాగే, ఎల్లుండి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సైతం టీకాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రేపు తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజక వర్గాలలో డీకే శివకుమార్ ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు తాండూరు.. సాయంత్రం 4 నుంచి 5 వరకు పరిగి, అలాగే, సాయంత్రం 6 నుంచి 7 వరకు చేవెళ్లలో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
Read Also: PAK vs SA: దక్షిణాఫ్రికా లక్ష్యం 270 పరుగులు.. పాక్ గెలుస్తుందా?
ఇక, కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో హస్తం పార్టీ నేతలు సమావేశం కానున్నారు. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మలి విడత ప్రచారం స్టార్ట్ కానుంది. దీంతో ఈ ప్రచారానికి సంబంధించిన అంశాలపై ఈ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకులు చర్చించనున్నారు. అయితే, ఎల్లుండి తెలంగాణకు రానున్న మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎల్లుండి (ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు సంగారెడ్డిలో కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.. అలాగే, నర్సాపూర్లో సాయంత్రం నాలుగు గంటలకు కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.. ఇక, చివరగా సాయంత్రం ఆరు గంటలకు మెదక్లో ఖర్గే పాదయాత్ర చేయనున్నారు. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుండటంతో గులాబీ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది.