CM Revanth Reddy: కల్లులో నీళ్ళు ఏమైనా పొస్తున్నారా..? సీఎం రేవంత్ ఫన్నీ కామెంట్స్
- 45 లీటర్ల కల్లులో నీళ్ళు ఏమైనా పొస్తున్నారా..
- ఊర్లో బెల్ట్ షాపుల వల్ల మీకు ఏమైనా ఉందా..
- రంగయ్య అనే గీత కార్మికుడితో ఫన్నీగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: 45 లీటర్ల కల్లులో, నీళ్ళు ఏమైనా పొస్తున్నారా? అనిని రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీగా మాట్లాడారు. అబ్దుల్లాపూర్ మెట్ తాటివనంలో ఈత మొక్కలను నాటారు. అనంతరం తాటివనంలో కాటమయ్య సేఫ్టీ కిట్స్ పనితీరును సీఎం పరిశీలించారు. తాటి చెట్టు ఎక్కి సేఫ్టీ కిట్స్ పనితీరును గౌడన్నలు వివరించారు. కిట్స్ పని తీరును గౌడన్నలను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. తాటి వనంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాటమయ్య రక్షణ కవచంతో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కారు. లైవ్ లో రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రిస్క్ చేయొద్దు బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అని తెలిపారు. రక్షణ కవచంతో వల్ల సేఫ్ గా ఉన్నామని రంగయ్య అనే గీత కార్మికుడు సీఎంతో చెప్పాడు. ఎల్లో టీషర్ట్ వేసుకున్న గీత కార్మికుడిని టీ షర్ట్ భాగుందని సీఎం రేవంత్ రెడ్డి కితాబు ఇచ్చారు.
Read also: Ratan Bhanadar : 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ దేవాలయం రత్న భాండాగారం
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
రోజుకు 15 చెట్లు గీస్తామని సీఎంతో తెలిపారు. 15 చెట్లు గీస్తే 45 లీటర్ల కల్లు వస్తుందని చెప్పారు. 45 లీటర్ల కల్లులో, నీళ్ళు ఏమైనా పొస్తున్నారా అని రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీగా మాట్లాడారు. ఊర్లో బెల్ట్ షాపుల వల్ల మీకు ఏమైనా ఉందా? అడిగి తెలుసుకున్నారు. ఊర్లో బెల్ట్ షాపులు లేవని చెప్పి..మాకు ఉపాధి కల్పించమన్నారు. వాన కాలం ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మహేష్ గౌడ్ కు MLC ఇచ్చాం.. మధు యాష్కీ అన్న ఒక్కరే ఖాలీగా ఉన్నాడు.. ఆయనకు ఇస్తామన్నారు. వనం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొత్త రోడ్లు వేసినప్పుడు వాటి వెంబడి తాటి చెట్లు , ఈత చెట్లు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. రియల్ ఎస్టేట్ వల్ల చెట్లు కొట్టేస్తున్నారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఎకరాలు భూమి కావాలని గీత కార్మికులు సీఎం చెప్పుకున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకు చెట్లు కొట్టొద్దని ఆదేశాలు ఇస్తామని చెప్పారు సీఎం. నీరా ఏర్పాట్లకు షాప్ లు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.
Cyber Fraud: అమెరికాలో ఆపదలో కూతురు.. రక్షిస్తామంటూ తండ్రికి సరికొత్త సైబర్ వల..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..