Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- తుక్కుగూడలో నర్సు హత్య..
- పోస్టుమార్టం నివేదికలో లైంగిక దాడి నిర్ధారణ..
- ప్రతిఘటించడంతో హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Se*xual Assault: తుక్కుగూడలో నర్సు శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరిగా ఉన్న సమయంలో శిరీషపై లైంగిక దాడికి ప్రయత్నించి, అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి బిహార్కు చెందిన కార్ల మెకానిక్ మహ్మద్ సనావుల్లా (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల శిరీష సుమారు ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రి ఆవరణలో ఉన్న హాస్టల్లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ సందర్భంగా రూమ్మేట్స్ స్వగ్రామాలకు వెళ్లడంతో శుక్రవారం రాత్రి శిరీష తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు శిరీష గది నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో పహాడీషరీఫ్ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా లైంగిక దాడి, హత్య కోణంలో విచారణ చేపట్టారు.
Also Read
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
చివరకు ఆస్పత్రి సమీపంలోని కార్ల మెకానిక్ షాపులో పనిచేస్తున్న సనావుల్లా ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇతర కార్మికులు వెళ్లిపోయిన తర్వాత అతడు అక్కడే నిద్రించేవాడని, కొంతకాలంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుల కదలికలను గమనించినట్లు దర్యాప్తులో తేలింది. శిరీష ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన సనావుల్లా.. అర్ధరాత్రి హాస్టల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. శిరీష ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో అదే మార్గం ద్వారా లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. లైంగిక దాడికి ప్రయత్నించగా శిరీష ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ ఘటనలో సనావుల్లా ఒక్కడే ఉన్నాడా? మరెవరైనా సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నిందితుడు ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తైన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!