Ramchander Rao: బిజెపి పొత్తుపై అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్పై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర విమర్శలు
- యూరియా కొరతను కృత్రిమంగా సృష్టిస్తున్నారని ఆరోపణ
- పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని
- కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని హెచ్చరిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రామచందర్ రావు, గద్వాలలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని, రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత గద్వాలకు మొదటిసారి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read:Bandi Sanjay: ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా, గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?
Also Read
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
- Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
రామచందర్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో యూరియా కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టిస్తోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు నిందలు మోపుతోందని విమర్శించారు. “కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది. రాష్ట్రానికి అవసరమైన యూరియా కంటే ఎక్కువగా ఇచ్చినప్పటికీ, రైతులకు ఎందుకు చేరడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఈ యూరియాను సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైంది,” అని ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు సవాల్ విసిరారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండగా, తెలంగాణలో మాత్రమే కొరత ఉందని, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Also Read:Bomb Threats: తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు..
“రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జిమ్మిక్కులతో బిజెపిని టార్గెట్ చేస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్, బిజెపిపై నిందలు వేస్తూ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోంది,” అని ఆయన విమర్శించారు. రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని రామచందర్ రావు స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే, ప్రజలు మోసపోతారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రజలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు,” అని ఆయన రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!