Ramchander Rao: బిజెపి పొత్తుపై అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్పై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర విమర్శలు
- యూరియా కొరతను కృత్రిమంగా సృష్టిస్తున్నారని ఆరోపణ
- పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని
- కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని హెచ్చరిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రామచందర్ రావు, గద్వాలలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని, రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత గద్వాలకు మొదటిసారి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read:Bandi Sanjay: ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా, గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
రామచందర్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో యూరియా కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టిస్తోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు నిందలు మోపుతోందని విమర్శించారు. “కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది. రాష్ట్రానికి అవసరమైన యూరియా కంటే ఎక్కువగా ఇచ్చినప్పటికీ, రైతులకు ఎందుకు చేరడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఈ యూరియాను సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైంది,” అని ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు సవాల్ విసిరారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండగా, తెలంగాణలో మాత్రమే కొరత ఉందని, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Also Read:Bomb Threats: తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు..
“రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జిమ్మిక్కులతో బిజెపిని టార్గెట్ చేస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్, బిజెపిపై నిందలు వేస్తూ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోంది,” అని ఆయన విమర్శించారు. రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని రామచందర్ రావు స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే, ప్రజలు మోసపోతారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రజలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు,” అని ఆయన రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!