Bandi Sanjay: ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా, గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?
- బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడి కూల్చివేతపై బండి సంజయ్ ఆగ్రహం
- కాంగ్రెస్పై రాజకీయ కుట్ర ఆరోపణ
- బీసీ రిజర్వేషన్లో ముస్లింలకు 10 శాతం కేటాయింపును వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడిని కూల్చడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను దారుణమైన చర్యగా అభివర్ణిస్తూ, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లను సంపాదించేందుకు కాంగ్రెస్ ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: PM Modi: ఆగస్టు 23 వరకు మీ సలహాలు, సూచనలు పంపండి..ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
బండి సంజయ్ మాట్లాడుతూ, “బోనాల పండుగ సమయంలో పెద్దమ్మ గుడిని కూల్చడం హిందువుల మనోభావాలను గాయపరిచే చర్య. రాష్ట్రంలో రోడ్డుకు అడ్డంగా ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నాయి? ఒక్క గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?” అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 80 శాతం హిందువులు ఏకమై ఈ చర్యకు సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. “ఈ కూల్చివేత వెనుక రాజకీయ లబ్ధి కోసం ఒక వర్గం ఓట్లను ఆకర్షించే కుట్ర ఉంది,” అని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ చెబుతున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ అనేది కేవలం ముస్లిం రిజర్వేషన్గా మారింది. బీసీలకు కేవలం 5 శాతం అదనపు రిజర్వేషన్ (27 శాతం నుంచి 32 శాతం) మాత్రమే వస్తుంది, మిగిలిన 10 శాతం ముస్లింలకు కేటాయిస్తున్నారు. ఇది బీసీ రిజర్వేషన్ కాదు, ముస్లిం రిజర్వేషన్,” అని ఆయన విమర్శించారు. ఈ విధానాన్ని తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “స్థానిక ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్కు బుద్ధి చెబుతారు,” అని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!