Ramappa temple: రామప్ప దేవాలయ వారసత్వ ఉత్సవాలు.. రానున్న సినీ తారలు, కళాకారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramappa temple heritage celebrations today: ములుగు జిల్లా రామప్ప దేవాలయం వారసత్వ ఉత్సవాలకు సిద్ధం అయ్యింది. ‘శిల్పం వర్ణం కృష్ణం’ అనే పేరుతో ప్రపంచ వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడాని ప్రభుత్వం ఏర్పట్లను పూర్తి చేసింది. యునెస్కో వారసత్వ సంపద రామప్ప దేవాలయంలో నిర్వహించనున్న ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లను అదనపు కలెక్టర్ వైవీ గణేష్, డీఆర్వో రమాదేవి, ఏఎస్సై, టూరిజం, టీఎస్టీడీసీ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్, డ్రమ్మర్ శివమణి, గాయకుడు కార్తీక్, ఫ్లాటిస్ట్ నవీన్ మరియు బలగం చిత్ర బృందం వంటి ప్రముఖ కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. మంగళవారం ములుగు పట్టణం నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల థీమ్ “శిల్పం, వర్ణం, కృష్ణం – సెలబ్రేటింగ్ హెరిటేజ్”. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం రామప్ప సరస్సు వద్ద, రామప్ప దేవాలయం ఎదుట అన్నదానోత్సవం (5:30PM -6:00PM) అశోక్ గురజాలే నేతృత్వంలో ఆరాభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వారిచే వయోలిన్ సింఫనీ ప్రదర్శించనున్నారు. పేరిణి రాజ్కుమార్ మరియు బృందంచే పేరిణి నృత్య ప్రదర్శన కూడా ఉంటుంది.
Also Read
- Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
Read also: Uttar pradesh: యూపీలో దారుణం.. 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
ఎనిమిది వందల ఏళ్ల నాటి ఈ శిల్పకళాకోసం, ఏండ్లనాటి శోక సంద్రాన్ని పోగొట్టి విజయంతో మెరిసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో తొలిసారిగా ఈరోజు ప్రపంచ వారసత్వ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ‘శిల్పం వర్ణం కృష్ణం, సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప’ అనే పేరుతో ఈ వేడుక జరిగింది. గతంలో ఇక్కడ ఎన్నో ఉత్సవాలు జరిగినా.. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. రామప్ప దేవాలయం శిల్ప శిఖరం మాత్రమే కాదు. సామాజిక స్పృహను ప్రేరేపించే వేదిక. నీటి విశిష్టతను.. జలమే నాగరికతకు పునాది అని చాటిచెప్పిన వారసత్వం. పువ్వులు, లతలు, హంసలు, ఏనుగులు, గుర్రాలు, మొసళ్లు, పక్షులు మరియు నీటిలో అల్లిన అన్ని జంతు జీవిత శిల్పాలు జీవవైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో రామప్ప ఆలయాన్ని నిర్మించి 2023 మార్చి 31 నాటికి 810 సంవత్సరాలు పూర్తయ్యాయి. క్రీ.శ. 31-3-1213లో నిర్మాణం పూర్తయినట్లు ఆలయ శాసనం తెలుపుతోంది. కాకతీయ చక్రవర్తి గణపతి సేనాధిపతి రాచర రుద్ర ఆలయాన్ని నిర్మించినప్పుడు, ఆనాటి ప్రసిద్ధ శిల్పి రామప్ప ఈ ఆలయాన్ని అద్భుతమైన కళాఖండంగా అలంకరించారు. కాకతీయుల సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన ఈ ఆలయం అనేక దండయాత్రలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నేటికీ కళాత్మక నైపుణ్యంతో సజీవంగా ఉంది. ఇక్కడ శివుడు రుద్రేశ్వరుడు మరియు రామలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. దశాబ్దాల తరబడి గుర్తింపు లేని ఆలయ అందాలు ఇప్పుడు ప్రపంచ పారవశ్యాన్ని సంతరించుకుంటున్నాయి.
Safest Banks List: RBI ప్రకారం.. దేశంలో సురక్షితమైన బ్యాంకులు ఇవేనట
తాజావార్తలు
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!