రైతులకు కేసీఆర్ చేసిందేమీ లేదు: రామచందర్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు కేసీఆర్ చేసిందేమి లేదని బీజేపీ సీనియర్ నేత రామచందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు బీజేపీ సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ , సీపీఎం, సీపీఐ పార్టీలు వేర్వేరు కాదన్నారు. అన్ని ఒక్కటే దారిలో నడుస్తాయని ఎద్దేవా చేశారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో టీఆర్ఎస్కు చెందిన ప్రజా ప్రతినిధులే అధిక సంఖ్యలో ఉన్నారన్నారు.
Read Also: HRA , CCA, ఇతర సౌకర్యాలను యథాతథంగా కొనసాగించాలి: ఏపీ ఉద్యోగ సంఘాలు
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
అంతా బావుంటే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యుత్ ఎంత ఉత్పత్తి చేస్తున్నారో చెప్పాలి? 20రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాయని రామచందర్ రావు అన్నారు. కేసీఆర్ నీళ్లు ఇస్తే.. రైతులు 23లక్షల బోర్లు ఎందుకు ఉపయోగిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో గ్రౌండ్ వాటర్ పెరగాడానికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని ఆయన తేల్చి చెప్పారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డిలాంటి వాళ్లకు అసలు రైతుం బంధుకు ఎందుకు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రామచందర్ రావు ప్రశ్నించారు.
- Tags
- bjp
- kcr
- Ramachandra Rao
- telangana
- TRS
తాజావార్తలు
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!