Ramchander Rao : రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది
- రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని ఆరోపణ
- "ఓట్ల చోరీ కాదు.. బోగస్ ఓట్లు ఉన్నాయి" – రామ చందర్ రావు
- కాళేశ్వరం విచారణలో సిబిఐపైనే నమ్మకం ఉందన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు
- మావోయిస్ట్లతో చర్చల కంటే ఆపరేషన్ కగార్నే మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రామ చందర్ రావు మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రతి విషయంలో సెంటర్పై నెపం వేస్తోంది. అధికారుల కొరతతో పాలనలో శూన్యత నెలకొంది. గ్రూప్ వన్ సమస్యతో సెలెక్ట్ అయినవారూ, కాలేని వారూ బాధపడుతున్నారు” అని అన్నారు.
Tirupati : తిరుపతిలో షాకింగ్ సంఘటన.. మద్యం మత్తులో పాము తల కొరికిన వ్యక్తి
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
“శ్యామ్ పిట్రోడా ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా రాహుల్ గాంధీ ఈ స్థితికి వచ్చారు. ఇప్పుడు ‘ఓట్ల చోరీ’ అనే కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఓట్ల చోరీ ఏదీ లేదు. బోగస్ ఓట్లు మాత్రం ఉన్నాయి. బోగస్ ఓట్లు వేరు, ఓట్ల చోరీ వేరు. ఈ తేడా కూడా తెలియని రాహుల్ గాంధీ ఒకసారి ఓట్ల చోరీ అంటారు, ఇంకోసారి హైడ్రోజన్ బాంబ్ అంటారు” అని ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా.. “సిబిఐ మీద మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం రాసిన లెటర్ ఇప్పటికే సిబిఐ ముందుంది. NDSA ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే పీసీ ఘోష్ విచారణ చేపట్టారు. అయితే ఆ విచారణలో నిందితులు ఎవరు అన్నది తేల్చారా? విచారణ తర్వాత రాజకీయ నాయకులను ఎవరినైనా అరెస్ట్ చేశారా?” అని ప్రశ్నించారు. “టెర్రరిజం, లెఫ్ట్ టెర్రరిజం రెండూ ఒక్కటే. మావోయిస్ట్లతో చర్చలు అనేక సార్లు జరిగాయి. కానీ ఆ చర్చల వల్ల హింస తగ్గలేదు, పెరిగింది. హింస పెరగడం వల్లే ఆపరేషన్ కగార్ ముందుకు వచ్చింది. మావోయిస్ట్లతో చర్చలు జరపాలా వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది” అని స్పష్టం చేశారు.
Asaduddin Owaisi: ఒవైసీ ఇంటిపై ఈడీ దాడులు ఎందుకు జరగలేదు..? క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం చీఫ్
తాజావార్తలు
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..