బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయి: డి.రాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ప్రారంభమైన ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలు. ఈ సభలు ఇవాళ్టినుంచి ఈనెల 10 వరకు జరగనున్నాయి. కాగా ఈ కార్యక్రమాలకు సీపీఐజనరల్ సెక్రటరీ డి. రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి. రాజా మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఏ ఐవైఎఫ్ నాకు తల్లి లాంటిదన్నారు. కమ్యూనిస్టు పార్టీ భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడిందన్నారు. కాంగ్రెస్తో పాటు ముందుండి పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్రలేని, బ్రిటిషర్లకు మోకరిల్లిన పార్టీ నేడు అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీ మాత్రం ప్రజాసమస్యలపై నేటికి వీధుల్లో పోరాడుతూనే ఉందన్నారు.
జవహార్లాల్ నెహ్రు ప్రభుత్వ రంగసంస్థలు ఆధునిక దేవాలయాలని నెలకొల్పితే వాటిని మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు అమ్ముతూ వారికి కొమ్ముకాస్తుందని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అచ్చేదీన్ ఎప్పుడు వస్తాయని ప్రజలు అడుగుతున్నారన్నారు. అంబానీ, అదానీలకు మాత్రమే మంచి రోజులు వచ్చాయి. సామాన్య ప్రజలకు రాలేదని దుయ్యబట్టారు. మోడీ పాలసీలు అన్నీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
Read Also: మూడో వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొందాం: హరీష్ రావు
బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది. మోడీ పాలసీలను, మోడీ పాలన తీరును వ్యతిరేకిస్తే జైల్లో పెడుతున్నారు. హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఉద్యమాన్ని చూసి….చేసేది లేక మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని డి. రాజా అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని దింపేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై పోరాటం ఎలా చేయాలో ఈ సమావేశాల్లో చర్చించాలని డి.రాజా అన్నారు.
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!