Raja Singh: ఆమ్నేషియా కేసులో నిందితుల పేర్లు బయటపెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగిక దాడి కేసులో నిందితుల పేర్లను వెంటనే బయటపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఐదుగురు అమ్మాయిపై లైంగిక దాడి చేశారు.. దీనిపై గత నెల 28న అమ్మాయి ఫిర్యాదు చేస్తే మే 31 పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మూడు రోజుల ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. సామూహిక లైంగిక దాడి కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతల కొడుకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. నిజమేంటో పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిందితుల పేర్లు మార్చేందుకు పోలీసులపై ప్రెజర్ ఉన్నట్లు తెలుస్తోందని రాజా సింగ్ అన్నారు. ఈ కేసు నుంచి నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తుల పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు కానీ.. వారు ఉపయోగించిన వాహనాల పేర్లను నమోదు చేశారని..ఆ యువతిని ఆ వాహనాలు రేప్ చేశాయా? వ్యక్తులా? అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో పెద్ద కుట్ర జరుగుతోందని..పేర్లు మార్చి వేరే వ్యక్తుల పేర్లు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు పెట్టారు, అందులో నిందితులు దొరకలేదా.? ఈ రెండు వాహనాల్లో ఎంతమంది యువకులు ఉన్నారో కూడా గుర్తించలేదా.? అని ప్రశ్నించారు.
Also Read
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు యాక్సిడెంట్ చేసినప్పుడు కూడా పేర్లు మార్చాలని ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో అత్యాచారాలు చేసేది, యాక్సిడెంట్లు చేసేది రాజకీయ నాయకుల కొడుకులే అని..మా నాన్న టీఆర్ఎస్ లో పెద్ద లీడర్, మా నాన్నకు రాజకీయంగా బాగా పలుకుబడి ఉందని బడా నేతల కొడుకులు భావిస్తున్నారని..అందుకే మేము అత్యాచారాలు చేస్తాం, యాక్సిడెంట్లు చేస్తామంటూ చెలరేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్ను మార్చేసింది.. చైతూ, అఖిల్కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!