R Krishnaiah: కేంద్రమంత్రులకి కృష్ణయ్య వార్నింగ్.. బీసీల వాటా ఇవ్వకపోతే రాష్ట్రంలో తిరగనియ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Krishnaiah Gives Strong Warning To Central Ministers: కేంద్రమంత్రులకు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే.. కేంద్రమంత్రులను తెలంగాణ రాష్ట్రంలో తిరగనియ్యమని హెచ్చరించారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 75 సంవత్సరాలు అయినా, బీసీలకు ఏ రంగంలో కూడా అవకాశాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలపై కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ కులాలను అణచిపెడుతోందని వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం మెజార్టీ ప్రజలను బిచ్చగాళ్లను చేసిందని పేర్కొన్నారు.
Bandi Sanjay: కన్నతల్లిని చంపి.. దండేసి కీర్తించే బాపతు కేసీఆర్
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
అంతకుముందు.. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయ అధికారంలో బీసీలకు న్యాయమైన వాటా లభించనంత వరకు.. సామాజిక న్యాయం సాధ్యం కాదని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో బీసీలకు 50శాతం సీట్లు రిజర్వ్ చేసేందుకు.. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలు తీర్మానం చేశాయని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో ఆశించిన ప్రయోజనం లేదన్న ఆయన.. రాజకీయ అధికారం ద్వారానే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు గతంలోనే రిజర్వేషన్లు కల్పించడం వల్ల చట్టసభల్లో ఉన్నతస్థానాలకు ఎదిగే అవకాశం ఏర్పడిందని.. కానీ బీసీలకు రిజర్వేషన్లు లేనందున అలాంటి ప్రయోజనాలు పొందలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Manchu Manoj: భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..
దేశంలో 2,600 బీసీ కులాలు ఉన్నాయని.. కానీ చట్టసభల్లోకి కేవలం 50 బీసీ కులాలు మాత్రమే ప్రవేశించాయని కృష్ణయ్య తెలిపారు. దేశ జనాభాలో 54శాతం బీసీలు ఉన్నా.. పార్లమెంటు సభ్యుల్లో బీసీల వాటా కేవలం 15 శాతం మాత్రమే ఉందని వెల్లడించారు. భారత రాజ్యాంగాన్ని 121సార్లు సవరించినా.. బీసీల సంక్షేమానికి సంబంధించి ఒక్క సవరణ కూడా చేయలేదన్నారు. రాజకీయ పార్టీలు క్యాబినెట్లో బీసీలకు అప్రాధాన్య శాఖలు కేటాయించి.. బీసీలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహించారు. ఆ కారణంగా బీసీల సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఈ విషయాన్ని తాము ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!