Deputy Manager: డిప్యూటీ మేనేజర్ చేతివాటం.. ఖాతాదారులకు తెలియకుండా రూ.8.65 కోట్లు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy Manager: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. పని చేస్తున్న బ్యాంకులో ఖాతాదారుల అకౌంట్ లోని డబ్బులను వాడుకున్నాడు. వేలల్లో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మేనేజర్ కొట్టేసింది సుమారు రూ.8.5 కోట్లు. దొంగిలించిన ఖాతాదారుల సొమ్మును ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు ఉపయోగించాడు. ఈ భాగోతం వెలుగులోకి రావడంతో ఈవార్త కాస్త సంచలనంగా మారింది.
Read also: Hyderabad: జహీరాబాద్లో విశాల్ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్ అహ్మద్ మృతి
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
కరీమాబాద్కు చెందిన బైరిశెట్టి కార్తీక్ నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కానీ అతను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. దీంతో బ్యాంకు నుంచి ఖాతాదారుల సొమ్మును వాడుకోవడం ప్రారంభించాడు. బ్యాంకులో బంగారం నిల్వ చేసి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు వచ్చిన ఖాతాదారుల నుంచి నగదు తీసుకుని బంగారం ఇచ్చాడు. కొంత డబ్బు చెల్లించి ఖాతాను రెన్యూవల్ చేయించుకుని నకిలీ లావాదేవీలు జరిపాడు. కొన్నిసార్లు బ్యాంకు లాకర్లలో ఖాతాదారులు ఉంచిన బంగారు ఆభరణాలను బయటకు తీసి అదే బంగారాన్ని బినామీ పేరుతో తన బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు. ఆ డబ్బుతో ఆన్లైన్లో బెట్టింగ్లు ప్రారంభించాడు. అక్కడక్కడా ఖాతాదారులను, బ్యాంకును మోసం చేస్తున్నాడు.
కొన్నిసార్లు కస్టోడియన్, ఆడిటర్ సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 128 మంది ఖాతాల నుంచి రూ.8.65 కోట్లు వాడినట్లు బ్యాంకు ఆడిటింగ్లో తేలింది. ఈ తతం గత నెల 11న వెలుగు చూసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఖాతాదారుల డబ్బును ఎలా తిరిగి ఇవ్వాలి? ఖాతాదారులకు తెలియకుండా బంగారం చోరీకి గురైనందున ఖాతాదారులకు నష్టం వాటిల్లకుండా బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
India: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల షేరింగే ప్రధాన ఎజెండానా?
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!