Deputy Manager: డిప్యూటీ మేనేజర్ చేతివాటం.. ఖాతాదారులకు తెలియకుండా రూ.8.65 కోట్లు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy Manager: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. పని చేస్తున్న బ్యాంకులో ఖాతాదారుల అకౌంట్ లోని డబ్బులను వాడుకున్నాడు. వేలల్లో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మేనేజర్ కొట్టేసింది సుమారు రూ.8.5 కోట్లు. దొంగిలించిన ఖాతాదారుల సొమ్మును ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు ఉపయోగించాడు. ఈ భాగోతం వెలుగులోకి రావడంతో ఈవార్త కాస్త సంచలనంగా మారింది.
Read also: Hyderabad: జహీరాబాద్లో విశాల్ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్ అహ్మద్ మృతి
Also Read
కరీమాబాద్కు చెందిన బైరిశెట్టి కార్తీక్ నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కానీ అతను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. దీంతో బ్యాంకు నుంచి ఖాతాదారుల సొమ్మును వాడుకోవడం ప్రారంభించాడు. బ్యాంకులో బంగారం నిల్వ చేసి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు వచ్చిన ఖాతాదారుల నుంచి నగదు తీసుకుని బంగారం ఇచ్చాడు. కొంత డబ్బు చెల్లించి ఖాతాను రెన్యూవల్ చేయించుకుని నకిలీ లావాదేవీలు జరిపాడు. కొన్నిసార్లు బ్యాంకు లాకర్లలో ఖాతాదారులు ఉంచిన బంగారు ఆభరణాలను బయటకు తీసి అదే బంగారాన్ని బినామీ పేరుతో తన బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు. ఆ డబ్బుతో ఆన్లైన్లో బెట్టింగ్లు ప్రారంభించాడు. అక్కడక్కడా ఖాతాదారులను, బ్యాంకును మోసం చేస్తున్నాడు.
కొన్నిసార్లు కస్టోడియన్, ఆడిటర్ సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 128 మంది ఖాతాల నుంచి రూ.8.65 కోట్లు వాడినట్లు బ్యాంకు ఆడిటింగ్లో తేలింది. ఈ తతం గత నెల 11న వెలుగు చూసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఖాతాదారుల డబ్బును ఎలా తిరిగి ఇవ్వాలి? ఖాతాదారులకు తెలియకుండా బంగారం చోరీకి గురైనందున ఖాతాదారులకు నష్టం వాటిల్లకుండా బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
India: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల షేరింగే ప్రధాన ఎజెండానా?
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..