Hyderabad: జహీరాబాద్లో విశాల్ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్ అహ్మద్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్కు పాతబస్తీ అడ్డాగా మారింది. ఇక్కడ కత్తిపోట్లూ, గ్యాంగ్ వార్లూ సర్వసాధారణం. కొందరు మద్యం తాగి గొడవలకు దిగుతుండగా, మరికొందరు కక్షలతో కత్తులు, తల్వార్లతో దాడికి దిగుతున్నారు. అయితే పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. అయితే ఈ పాత బస్తీలో ఏం జరుగుతుంది..? ఏ సమయంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించడం చాలా కష్టం. గత రాత్రి పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నజీర్ అహ్మద్గా గుర్తించారు. రెండేళ్ల క్రితం జహీరాబాద్లో విశాల్ షిండే హత్య కేసులో నజీర్ అహ్మద్ నిందితుడు. విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ సహా 7 మంది సభ్యులు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్లో నజీర్ అహ్మద్ను దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read also: Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్.. వైసీపీ గూటికి కీలక నేత
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్ గూడ శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన విశాల్ షిండే(22) సెప్టెంబర్ 2020 -29న అదృశ్యమై హత్యకు గురైన విషయం తెలిసిందే.. కనిపించడం లేదంటూ అతని తల్లి కల్పన ఫిర్యాదు చేయడంతో 30న ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు 2020 అక్టోబర్ 1న జహీరాబాద్ అడవుల్లో విశాల్ షిండే హత్యకు గురైనట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు జహీరాబాద్ ప్రాంతానికి చేరుకుని విశాల్ షిండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో నజీర్ (20), జహీర్ (19), మరికొందరు జహీరాబాద్ అడవుల్లో విశాల్ను హత్య చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
TSRTC: బస్సుల్లో క్యాష్లెస్ జర్నీ..! డిజిటల్ పేమెంట్ల ద్వారా టికెట్లు
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!