KCR: గులాబీ అధినేతతో పీకే, ఉండవల్లి భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..!
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామనే వార్తలు వస్తున్న వేళ పీకే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు, తెలంగాణలో పీకే టీం చేసిన సర్వే వివరాలను పీకే, సీఎం కేసీఆర్ కు అందించారు. దాదాపు 3 గంటల పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించేదుకు ఈ నెల 15న ఢిల్లీకి రావాల్సిందిగా సీఎం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారు. అయితే తాజాగా పీకే భేటీ కావడం ప్రాధన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. అయితే మరో రెండు రోజులు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు.
ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అభ్యర్థుల కూర్పు ఏ విధంగా ఉండాలనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే పీకే చేసిన సర్వేలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి, గ్రాఫ్ ఏ విధంగా ఉందనే వివరాలను పీకే, సీఎం కేసీఆర్ కు అందించారు. తాజాగా తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో పీకే టీం చేసిన సర్వే వివరాలను కూడా సీఎం కేసీఆర్ కు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి ముందస్తుకు వెళ్తే దాదాపుగా 40-50 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందస్తుకు వెళ్తే ఏది మంచి సమయం అనే దానిపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. జాతీయ పార్టీ ఏర్పాటు అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read
ఇదిలా ఉంటే ఏపీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. కాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్, ఈ విషయంపై ఉండవల్లితో భేటీ అయినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న సీఎం కేసీఆర్, ఏపీ బాధ్యతలను ఉండవల్లికి అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!