వైఎస్ షర్మిల కోసం రంగంలోకి పీకే..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు తెలియనివారుండరు.. ఆయన వ్యూహాలతో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి.. మొన్నటి మొన్న పశ్చిమ బెంగాల్లో దీదీ వరకు ఎంతో మంది పీఠాన్ని ఎక్కారు.. నితీష్ కుమార్, వైఎస్ జగన్, స్టాలిన్.. ఇలా చాలా మందికే వ్యూహ రచన చేశారు పీకే.. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా.. తన టీమ్ను రంగంలోకి దింపి పనిమొదలు పెడతారు. అయితే, బెంగాల్ ఫలితాల తర్వాత తన వృత్తిని వదిలేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. కానీ, దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు కొన్ని ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. మరోవైపు.. ఆయన శిష్యులు కూడా వ్యూహ రచనకు తాము సైతం అంటున్నారు.. తెలంగాణలో త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమైన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కోసం పీకే శిష్యురాలు ప్రియా ఎంట్రీ ఇచ్చారు.
ప్రశాంత్ కిషోర్ టీమ్లో పనిచేసిన ప్రియా.. తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె.. తమిళనాడు ఎన్నికల సమయంలో పీకే టీమ్లో ప్రియా ప్రముఖంగా పనిచేశారని చెబుతారు.. ఆమెను ఇప్పుడు తన వ్యూహకర్తగా నియమించుకున్నారట వైఎస్ షర్మిల… ఇక, ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. తెలంగాణలో ఆవిర్భవించనుంది.. ఈనెల 8వ తేదీ ఉదయం ఇడుపులపాయలో 8.30 గంటలకు ప్రార్థనలు నిర్వహించనున్న ఆమె.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి.. జేఆర్సీ కన్వెన్షన్లో సాయంత్రం 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే పార్టీ పేరు, జెండా, అజెండా ఖరారు కాగా.. 8వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక, వైఎస్ షర్మిల ఎలా ప్రసంగించాలి..? ఏ అంశాలు లేవనెత్తాలనే దానిపై ఎప్పటికప్పుడు.. ఎన్నికల వ్యూహకర్త ప్రియా సూచనలు చేయనున్నారని తెలుస్తోంది.. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్.. భారత రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు.. మరి ఆయన శిష్యురాలు.. ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి. ఏపీలో వైఎస్ జగన్ను తిరుగులేని విజయాన్ని అందించిన పీకే.. తెలంగాణలో తన శిష్యురాలిని ముందు పెట్టినా.. ఆయనే వ్యూహాలు అందిస్తారనే ప్రచారం కూడా లేకపోలేదు.. గత కొంత కాలంగా.. షర్మిల కొత్త పార్టీ వెనుక ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
Also Read
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
-
Peddi : 400 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!