Ponnam Prabhakar : భవిష్యత్లో స్థానిక సంస్థలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం
- పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్మన్
- జడ్పీటిసి
- ఎంపిపి లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం
- ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 2019 నుండి 2024 వరకు పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్మన్, జడ్పీటిసి, ఎంపిపి లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, వైస్ చైర్మన్ పెరాల గోపాల్ రావు , జడ్పీటిసి, ఎంపిపి లను ఘనంగా సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్ సభ్యులకు, ఎంపిపి లకు శుభాకాంక్షలు తెలిపారు. 5 సంవత్సరాల ప్రజా జీవితంలో నిధులున్నా ,లేకున్నా అనేకా కష్టాలు వచ్చినా ప్రజల సమస్యలు ఎదుర్కొనీ మంచి పేరు సంపాదించుకున్నారని, జడ్పీటిసి సభ్యునిగా మీ పదవి ముగిసినప్పటికీ ప్రజా జీవితంలో మీరు మళ్ళీ ఏదో ఒక రూపంలో ఎన్నికై ప్రజలతో ఉండాలని కోరుకుంటున్నా అని మంత్రి పొన్నం అన్నారు.
అంతేకాకుండా..’నేను గతంలో కొత్తగా సింగిల్ విండో అధ్యక్షుడు అయిన తరువాత పెద్దల ఆశీర్వాదం తో సహకార రంగంలో విజయవంతంగా పని చేశా.. కరీంనగర్ జిల్లా పరిషత్ కు మా రాజకీయ గురువు చొక్కారావు గారు గతంలో చైర్మన్ గా అయ్యారు… తరువాత చాలా మంది ఎన్నికయ్యారు.. ప్రజా సమస్యలు పరిష్కరించిన వాటికి సంతృప్తిగా తీపి గుర్తుగా ఉంటాయి.. కొన్ని పరిష్కారం కానివి ఉన్న వాటిని మళ్ళీ పరిష్కారం దిశగా పదవుల్లో ఉన్నా లేకున్నా అవి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలి.. భవిష్యత్ లో స్థానిక సంస్థలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ గారి నేతృత్వంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.. పదవుల్లో ఉన్నన్ని రోజులు రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వకంగా ,అరోగ్యకైరమైన వాతావరణం లో పని చేశాం.. రాబోయే కాలంలో మీకు మరింత మంచి జరగాలని , భవిష్యత్ లో మరిన్ని పదవులు రావాలని కోరుకుంటున్న.. పదవి పూర్తి చేసుకున్న జడ్పీటిసి లకు శుభాకాంక్షలు తెలుపుతున్న.. రాజకీయాలకు అతీతంగా సహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నాం.. ఏ సమస్య ఉన్న పార్టీలకు అతీతంగా ఓపెన్ గా చెప్పుకోవచ్చు.. మీరంతా భవిష్యత్ లో మరిన్ని పదవులు సాధించవచ్చు.. ప్రజా జీవితంలో మరింతగా ముందుకు పోతుండాలని కోరుకుంటున్న..’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!