Ponguleti: త్వరలో ఫ్లో మొదలవుతుంది.. పాలమూరు సభ ఖమ్మంని మరిపించేలా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: త్వరలో ఫ్లో మొదలవుతుంది.. పాలమూరు సభ..ఖమ్మంని మరిపించేలా ఉంటుందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆయన నివాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో..అది నెరవేర్చాలి అనేదే మా అజెండా అని తెలిపారు. అంతకు మించి ప్రత్యేక అజెండా లేదని తెలిపారు. పదవులు..కమిటీల ఆలోచనే లేదన్నారు. కేసీఆర్ ని ఇంటికి పంపించడమే ప్రధాన అజెండా అని అన్నారు. జగన్ ని నేను కలవలేదన్నారు. సీఎం ఆఫీస్ కి వెళ్లినా.. అధికారులను కలిశా అన్నారు. జగన్ ని కలిసినప్పుడు కూడా ఆయన పార్టీకి.. తెలంగాణ మీద ఆలోచనే లేదన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరే అంశం నా దృష్టిలో లేదని తెలిపారు. మోడీ సభ ను కేసీఆర్ బహిష్కరణ చేశారా? నటించారా? అని ప్రశ్నించారు. మోడీ..కేసీఆర్ మధ్య నువ్వు కొట్టినట్టు..నేను ఏడ్చినట్టు చెయ్ అన్నట్టు ఉంది బంధం అని వ్యంగాస్త్రం వేశారు. బీఆర్ఎస్ నుండి కూడా కాంగ్రెస్ లో చేరికలు ఉంటాయని తెలిపారు. త్వరలో ఫ్లో మొదలవుతుందని అన్నారు. పాలమూరు సభ.. ఖమ్మంని మరిపించేలా ఉంటుందన్నారు.
Read also: Teachers Strike: దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్.. బోనాలతో ప్రత్యేక ర్యాలీ..
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
భట్టి మాట్లాడుతూ.. పొంగులేటి మర్యాద పూర్వకంగా కలిశారని అన్నారు. జిల్లా రాజకీయాలపై చర్చ చేశామన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎలా అనే దానిపై చర్చ చేశామన్నారు. బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో పడేసి అధికారంలోకి వస్తామన్నారు. ఎలా రావాలి అనే దానిపై చర్చించామన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కొల్లాపూర్లో నిర్వహించే భారీ బహిరంగ సభ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. సభ తేదీ.. ఏఐసీసీ త్వరలో ప్రకటిస్తారని స్పష్టం చేశారు. త్వరలోనే రాహుల్ గాంధీని కలుస్తానని అన్నారు. పాదయాత్ర పై బుక్ రిలీజ్ చేస్తామన్నారు. మోడీ..కేసీఆర్ ఒక్కటే అన్నారు.
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు
తాజావార్తలు
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!