BJP Leaders: తెలంగాణ బీజేపీలో కీలక నిర్ణయం.. ఈటల, అరవింద్లకు అదనపు భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leaders: తెలంగాణ బీజేపీ ఇద్దరు నాయకులకు వై ప్లస్ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. బీజేపీలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్లకు అదనపు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సమాచారం. ఈటల రాజేందర్కు ‘వై’ ప్లస్ భద్రతను కేటాయించారు. ఈటల రాజేందర్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉంటారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించనున్నారు. ఇందులో భాగంగా ధర్మపురి అరవింద్కు 8 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణగా ఉంటారు.
Read also: Teachers Strike: దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్.. బోనాలతో ప్రత్యేక ర్యాలీ..
Also Read
ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇళ్ల వద్ద పరిస్థితిని సమీక్షించనున్నారు. హైదరాబాద్తో పాటు నియోజకవర్గాల్లోని వారి నివాసాల భద్రతపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత భద్రతను ఏ విధంగా సమన్వయం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కానీ ధర్మపురి అరవింద్ నివాసంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల ఈటల రాజేందర్కు ప్రాణహాని ఉందని ఆయన భార్య జమున ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈటల భద్రతపై ఆరా తీశారు. ఈ క్రమంలో వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు ఈటల కూడా తన భద్రతపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.
TS Congress: భట్టితో జూపల్లి భేటీ.. కొల్లాపూర్ సభపై చర్చ
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!