Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Ponguleti Srinivas Reddy Sensational Comments On Kcr

Ponguleti Srinivasa Reddy: ఫామ్ హౌస్ లో ఉంటూ ఇంకా సీఎం గానే ఫీలవుతున్నారు..

Published Date :April 28, 2024 , 2:23 pm
By Bhanu
Ponguleti Srinivasa Reddy: ఫామ్ హౌస్ లో ఉంటూ ఇంకా సీఎం గానే ఫీలవుతున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ponguleti Srinivasa Reddy: ఫామ్ హౌస్ లో ఉంటూ ముఖ్యమంత్రి గా ఉన్నట్లు అపోహలో ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కు సెటైర్ వేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ నాడు ప్రజలను, ఎమ్మెల్యే లను, మంత్రులను కలవలేదన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులుగా మార్చారన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు.. దళితులకు భూమి ఇవ్వలేదు,ఇళ్ళు ఇవ్వలేదన్నారు. ఫామ్ హౌస్ లో ఉంటూ ముఖ్యమంత్రిగా ఉన్నట్లు అపోహలో ఉన్నారని వ్యంగాస్త్రం వేశారు. కళ్ళు తెరిచి, మత్తు తెరుచుకుని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఏం చేసామో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఏం చేశాడని ఓటు వేయాలి.. ఫోన్లు ట్యాప్ చేశాడని ఓట్లు వేయాలా? అని ప్రశ్నించారు. అందరి లక్ష్యం ఒక్కటే.. రాహుల్ గాందీ ని దేశ ప్రధాని చేయటం అన్నారు.

Read also: Leopard at Shamshabad: శంషాబాద్ లో చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు

బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల లోనే దేశ పరువు, ప్రతిష్టలను ఇతర దేశాలకు తాకట్టు పెట్టిందన్నారు. రైతుల కోర్కెలను విస్మరించి సుమారు ఎనిమిది వందల మంది రైతులను బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను విస్మరించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పని మాటలను బీజేపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. మాయమాటలు చెప్పటం,పూటకో దేశానికి తిరగటం,ఖరీదైన బట్టలు మార్చుకోవడం చేస్తున్న మొదికి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మతాలను, కులాలను రెచ్చగొడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ భారత దేశంలో మూడో సారి ప్రధాని కావాలని చూస్తున్నారని మండిపడ్డారు. చివరకు రాములవారిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చిన బీజేపీకు ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. రెండు సార్లు అవకాశం వచ్చినా రాజీవ్ గాంధీ ప్రధాని కాలేదన్నారు. రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలన్నారు. ఇందిరమ్మ కుటుంబానికి అందరం అండగా ఉండాలన్నారు.

Read also: Thummala Nageswara Rao: గోదావరి నీళ్లను తెచ్చి లంకాసాగర్ ప్రాజెక్ట్ నింపుతాం..

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చెప్పిన హామీలనే కాకుండా చెప్పని హామీలను ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ జరుగుతుందన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రేషన్ కార్డు, పెన్షన్ ఇతర హామీలన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం ఎంపీ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 65 ఏళ్ల నుండి రఘురాంరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. దోచుకోవటం కోసమో, దాచుకోవటం కోసమో రఘురాం రెడ్డి పోటీ చేయటం లేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులను హెచ్చరిస్తున్నాం.. మాట జారేముందు ఆలోచనతో మాట్లాడాలని అన్నారు. కేవలం 13 రోజుల మాత్రమే సమయం ఉంది..కొద్దీ టైం లోనే మరింత కష్టపడాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ వచ్చేలా కష్టపడి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి.. ప్రచారం చేయాలన్నారు.
V. Hanumantha Rao: కాంగ్రెస్ కులగణన చేస్తామంటే.. మోడీకి భయం పట్టుకుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kcr
  • Ponguleti Srinivas Reddy
  • Ponguleti Srinivas Reddy comments on KCR
  • Ponguleti Srinivas Reddy sensational comments on KCR
  • Ponguleti Srinivas Reddy Vs KCR

తాజావార్తలు

  • Rajyasabha Elections: రాజ్యసభకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్..

  • Raptee HV: 1 గంటలో 80% ఛార్జ్, 200KM రేంజ్.. హై-వోల్టేజ్ బైక్ రాప్టీ హెచ్ వీ డెలివరీలు స్టార్ట్

  • BV Raghavulu: ఆయన విశ్వగురు కాదు.. విశ్వ తొత్తు అని పేరు పెట్టొచ్చు..

  • Iran-US-Israel War: ఇరాన్ యుద్ధం షాక్.. ఈ వస్తువుల ధరలు ఆకాశానికి!

  • Israel-Iran War: యూఎస్-ఇజ్రాయిల్ భీకర దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి..

ట్రెండింగ్‌

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions