Ponguleti Srinivasa Reddy: ఫామ్ హౌస్ లో ఉంటూ ఇంకా సీఎం గానే ఫీలవుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivasa Reddy: ఫామ్ హౌస్ లో ఉంటూ ముఖ్యమంత్రి గా ఉన్నట్లు అపోహలో ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కు సెటైర్ వేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ నాడు ప్రజలను, ఎమ్మెల్యే లను, మంత్రులను కలవలేదన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులుగా మార్చారన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు.. దళితులకు భూమి ఇవ్వలేదు,ఇళ్ళు ఇవ్వలేదన్నారు. ఫామ్ హౌస్ లో ఉంటూ ముఖ్యమంత్రిగా ఉన్నట్లు అపోహలో ఉన్నారని వ్యంగాస్త్రం వేశారు. కళ్ళు తెరిచి, మత్తు తెరుచుకుని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఏం చేసామో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఏం చేశాడని ఓటు వేయాలి.. ఫోన్లు ట్యాప్ చేశాడని ఓట్లు వేయాలా? అని ప్రశ్నించారు. అందరి లక్ష్యం ఒక్కటే.. రాహుల్ గాందీ ని దేశ ప్రధాని చేయటం అన్నారు.
Read also: Leopard at Shamshabad: శంషాబాద్ లో చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు
Also Read
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల లోనే దేశ పరువు, ప్రతిష్టలను ఇతర దేశాలకు తాకట్టు పెట్టిందన్నారు. రైతుల కోర్కెలను విస్మరించి సుమారు ఎనిమిది వందల మంది రైతులను బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను విస్మరించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పని మాటలను బీజేపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. మాయమాటలు చెప్పటం,పూటకో దేశానికి తిరగటం,ఖరీదైన బట్టలు మార్చుకోవడం చేస్తున్న మొదికి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మతాలను, కులాలను రెచ్చగొడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ భారత దేశంలో మూడో సారి ప్రధాని కావాలని చూస్తున్నారని మండిపడ్డారు. చివరకు రాములవారిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చిన బీజేపీకు ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. రెండు సార్లు అవకాశం వచ్చినా రాజీవ్ గాంధీ ప్రధాని కాలేదన్నారు. రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలన్నారు. ఇందిరమ్మ కుటుంబానికి అందరం అండగా ఉండాలన్నారు.
Read also: Thummala Nageswara Rao: గోదావరి నీళ్లను తెచ్చి లంకాసాగర్ ప్రాజెక్ట్ నింపుతాం..
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చెప్పిన హామీలనే కాకుండా చెప్పని హామీలను ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ జరుగుతుందన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రేషన్ కార్డు, పెన్షన్ ఇతర హామీలన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం ఎంపీ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 65 ఏళ్ల నుండి రఘురాంరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. దోచుకోవటం కోసమో, దాచుకోవటం కోసమో రఘురాం రెడ్డి పోటీ చేయటం లేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులను హెచ్చరిస్తున్నాం.. మాట జారేముందు ఆలోచనతో మాట్లాడాలని అన్నారు. కేవలం 13 రోజుల మాత్రమే సమయం ఉంది..కొద్దీ టైం లోనే మరింత కష్టపడాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ వచ్చేలా కష్టపడి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి.. ప్రచారం చేయాలన్నారు.
V. Hanumantha Rao: కాంగ్రెస్ కులగణన చేస్తామంటే.. మోడీకి భయం పట్టుకుంది..
తాజావార్తలు
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!