Ponguleti Srinivas Reddy: ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. తగ్గేదేలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy Gives Warning: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా సరే.. తన అభిమానులకు అండగా ఉంటానని, తన కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేందుకు తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో పొంగులేటి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తనని గుండెల్లో పెట్టుకున్న అభిమానులకు తానున్నానని భరోసా ఇచ్చారు. తన కుటుంబం జోలికొస్తే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఎవరి సొత్తు కాదని ఉద్ఘాటించారు.
అంతకుముందు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి ధ్వజమెత్తారు. కరోనావైరస్ కారణంగా రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేయలేదని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం, మరి వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం ఎందుకు నిర్మిస్తోందని ప్రశ్నించారు. గొప్పలకు పోయే బదులు, కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఆ డబ్బును ఖర్చు చేయొచ్చు కదా అని హితవు పలికారు. పేరు, బ్రాండ్, నామస్మరణ కోసం తప్ప.. తెలంగాణ బిడ్డల బాగోగుల గురించి పాలకులు ఆలోచించడం లేదని విమర్శించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ బిడ్డలు కన్న కలలను ఏ మేర నెరవేర్చామన్న విషయంపై.. అధికారంలో ఉన్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క నెలలోనే ధరణిని క్రమపద్ధతిలో పెడతామని ప్రభుత్వం చెప్పినా.. ఏడాదిన్నర కాలంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంటే.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఎందుకు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని పొంగులేటి నిలదీశారు. పార్టీ తొత్తులకే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కట్టబెడుతున్నారని, సమయం వచ్చినప్పుడు ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోకక తప్పదని హెచ్చరించారు. రాబోయే 15 ఏళ్లకైనా గోదావరి నీళ్లతో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!