Ponguleti Srinivas Reddy: పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. ప్రజల్లో ప్రేమాభిమానాలు ఉంటే అవే వస్తాయి..
Ponguleti Srinivas Reddy: రాజకీయంగా వచ్చే పదవులు ఎవరికి శాశ్వతంగా ఉండవని.. ప్రజల్లో ప్రేమ అభిమానాలు ఉంటే పదవులు వాటి అంతటికి అవే వస్తాయన్నారు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. శనివారం చండ్రుగొండ మండల కేంద్రంలో తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి నిధులు, పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు సాగుదారులందరికీ గిరిజన, గిరిజనేతరులందరికీ, పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు పట్టాలు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
2019 ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ ప్రజలకు మేలు జరుగుతాయనే ఉద్దేశంతో ఇన్ని రోజులు పార్టీలోనే కొనసాగటం జరిగిందన్నారు పొంగులేటి.. అదే శీనన్నకు పదవులే కావాలి, హోదానే కావాలనుకుంటే 2019 ఎన్నికల్లోనే నేను నన్ను నమ్ముకున్న వాళ్లు, ప్రజా ప్రతినిధులు అయ్యేవాళ్లమన్నారు. ఈరోజు పదవుల్లో కొనసాగుతున్న వారి పదవులు శాశ్వతం కాదన్నారు. ప్రజల ప్రేమ ఆప్యాయతే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ క్యాంపు కార్యాలయాలు ప్రజలకు ఏ సమస్యలు ఉన్న నేరుగా వచ్చి ఈ కార్యాలయంలో తెలియజేసిన వారి సమస్యలు పరిష్కరించేందుకే ఈ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని.. ప్రత్యేక రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయని పోరాటాలు చేసి ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అన్నారు పొంగులేటి.. తెలంగాణ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ రావడంలో కీలకపాత్ర పోషించిన బీజేపీని కాదని.. మనం కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేశాం.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఎన్నుకున్నాం.. 9 సంవత్సరాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. కానీ, తెలంగాణలో రైతాంగం ఏదైతే కలగన్నారో అది సాధ్యం కాలేదన్నారు.. రాష్ట్రంలో గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదు.. ఒరిగింది ఏమీ లేదని తెలంగాణ బిడ్డలు అనుకుంటున్నారని తెలిపారు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.
తాజావార్తలు
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో