మహబూబాబాద్ కౌన్సిలర్ రవిని హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. హత్యతో సంబంధం ఉన్న 7గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో వినయ్, అరుణ్ ప్రధాన నిందితులుగా మిగిలిన ఐదుగురు వారికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. భూక్యా వినయ్ కుమార్, భూక్యా అరుణ్, అజ్మిరా బాలరాజు, గుగులోతు చింటూ, కారపాటి సుమంత్, అజ్మిరా కుమార్, గుగులోతు భావు సింగ్లు నిందితులుగా పోలీసులు వెల్లడించారు.
వారి నుండి మారునాయుధాలు గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బానోతు రవితో గతంలో అక్రమ వ్యాపారాలు కలసి చేసిన ప్రధాన నిందితులు రవితో విడిపోయినా స్వంతగా కలప, బియ్యం వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇది గిట్టని రవి పోలీసులకు పట్టిస్తున్నాడని కోపంతోనే ఈ హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ వెల్లడించారు.