Police Allowance: పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ రద్దు..? ఎస్కార్ట్, గన్మెన్లు ఎందుకంటూ చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం పలుజిల్లాల్లో పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్లను రద్దు చేసింది. దానికి గల కారణం మావోయిస్టు కార్యకాలాపాలు తగ్గుముఖం పట్టాయనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకుందని టాక్.. అయితే.. గతంలో రాజధాని మినహా మిగిలిన ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ఈ అలవెన్స్ ఉండేది. మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉన్న కాలంలో శాంతిభద్రతల విభాగం, ఏఆర్, ప్రత్యే పోలీస్ విభాగాల్లో పనిచేసే వారికి ఇది వర్తించేది. ఈనేపథ్యంలో.. గతనెల వరకు ఈ అలవెన్స్ ను ఇస్తూ వచ్చి.. ఆతరువాత కొన్ని జిల్లాల్లో మినగా మిగిలిన జిల్లాలకు ఉండబోదని తాజాగా ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు మౌఖికంగా ఠాణాలకు సమాచారం ఇచ్చారు.
read also: COVID19 : ఇండియాలో కరోనా కల్లోలం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
అయితే.. మవోయిస్టు ప్రభావిత ప్రాంతాల గురించి కేంద్ర హోంశాఖ తాజాగా వెలువరించిన జాబితా ఆధారంగా కోత విధించినట్లు సమాచారం. కాగా.. కేంద్ర హోంశాఖ ఇటీవల 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి భద్రత సంబంధిత వ్యయం పథకం కింద నిధుల్ని విడుదల చేసింది. దీంతో.. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలున్నాయి. అయితే.. ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి మాత్రం అలవెన్స్ ఇస్తూ.. మిగిలిన జిల్లాలకు కోత విధించడం గమనార్హం. కాగా.. ఆ ఎనిమిది జిల్లాల్లోనూ మావోయిస్టు ప్రభావం అంతగా లేని కొన్ని ఠాణాలకు మినహాయింపు ఇచ్చారు. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, పొత్కపల్లి పోలీస్స్టేషన్లకు మాత్రమే అలవెన్స్ వర్తింపజేయడం చర్చనీయాంశానికి దారితీసింది.
పోలీస్ వాట్సప్ గ్రూపుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి పోలీసులకు అలవెన్స్ను రద్దు చేయడంతో తెలంగాణలో నక్సల్స్ లేరని పోలీసులకు ఇచ్చే 15 శాతం స్పెషల్ అలవెన్స్ తొలగించడం మంచిగానే వుంది సార్.. మరి లేని నక్సల్స్ నుంచి రక్షణ కోసం రాజకీయ నాయకులకు, అధికారులకు ఎస్కార్ట్, గన్మెన్లు ఎందుకు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అఫీసులకు, ఇళ్లకి గార్డులు ఎందుకు ?’ అంటూ సందేశాలు తెలుపుతుండటంతో ఈ వార్త కాస్త వైరల్గా మారింది.
Lal Darwaza Bonalu: సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!