Police Allowance: పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ రద్దు..? ఎస్కార్ట్, గన్మెన్లు ఎందుకంటూ చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం పలుజిల్లాల్లో పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్లను రద్దు చేసింది. దానికి గల కారణం మావోయిస్టు కార్యకాలాపాలు తగ్గుముఖం పట్టాయనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకుందని టాక్.. అయితే.. గతంలో రాజధాని మినహా మిగిలిన ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ఈ అలవెన్స్ ఉండేది. మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉన్న కాలంలో శాంతిభద్రతల విభాగం, ఏఆర్, ప్రత్యే పోలీస్ విభాగాల్లో పనిచేసే వారికి ఇది వర్తించేది. ఈనేపథ్యంలో.. గతనెల వరకు ఈ అలవెన్స్ ను ఇస్తూ వచ్చి.. ఆతరువాత కొన్ని జిల్లాల్లో మినగా మిగిలిన జిల్లాలకు ఉండబోదని తాజాగా ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు మౌఖికంగా ఠాణాలకు సమాచారం ఇచ్చారు.
read also: COVID19 : ఇండియాలో కరోనా కల్లోలం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
అయితే.. మవోయిస్టు ప్రభావిత ప్రాంతాల గురించి కేంద్ర హోంశాఖ తాజాగా వెలువరించిన జాబితా ఆధారంగా కోత విధించినట్లు సమాచారం. కాగా.. కేంద్ర హోంశాఖ ఇటీవల 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి భద్రత సంబంధిత వ్యయం పథకం కింద నిధుల్ని విడుదల చేసింది. దీంతో.. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలున్నాయి. అయితే.. ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి మాత్రం అలవెన్స్ ఇస్తూ.. మిగిలిన జిల్లాలకు కోత విధించడం గమనార్హం. కాగా.. ఆ ఎనిమిది జిల్లాల్లోనూ మావోయిస్టు ప్రభావం అంతగా లేని కొన్ని ఠాణాలకు మినహాయింపు ఇచ్చారు. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, పొత్కపల్లి పోలీస్స్టేషన్లకు మాత్రమే అలవెన్స్ వర్తింపజేయడం చర్చనీయాంశానికి దారితీసింది.
పోలీస్ వాట్సప్ గ్రూపుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి పోలీసులకు అలవెన్స్ను రద్దు చేయడంతో తెలంగాణలో నక్సల్స్ లేరని పోలీసులకు ఇచ్చే 15 శాతం స్పెషల్ అలవెన్స్ తొలగించడం మంచిగానే వుంది సార్.. మరి లేని నక్సల్స్ నుంచి రక్షణ కోసం రాజకీయ నాయకులకు, అధికారులకు ఎస్కార్ట్, గన్మెన్లు ఎందుకు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అఫీసులకు, ఇళ్లకి గార్డులు ఎందుకు ?’ అంటూ సందేశాలు తెలుపుతుండటంతో ఈ వార్త కాస్త వైరల్గా మారింది.
Lal Darwaza Bonalu: సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!