Pneumonia Cases: వాతావరణంలో మార్పు.. న్యుమోనియా బారినపడుతున్న పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pneumonia Cases: దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ పెద్ద సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు, 24 గంటల వ్యవధిలో 166 కొత్త వ్యక్తులు కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. వీటిలో అత్యధికంగా 166 కొత్త కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. వాతావరణంలో మార్పుల కారణంగా, చాలా మంది జ్వరం బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న చలి గాలులు, చలితో చిన్న పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, న్యుమోనియా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి లక్షణాలతో ఇప్పటికే 50 మంది హైదరాబాద్లోని నీలోఫర్లో చేరారు. జలుబు, తీవ్రమైన దగ్గు, జ్వరం, గొంతునొప్పితో ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొందరికి 5-6 రోజులైనా జ్వరం తగ్గకపోగా, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే న్యుమోనియాగా గుర్తించి ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. న్యుమోనియా లక్షణాలు కనిపించినప్పుడు యాంటీబయాటిక్స్ స్వీయ-నిర్వహణ చేయకూడదని వైద్యులు సలహా ఇస్తారు.
Read also: IND vs PAK: పాకిస్తాన్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే..!
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
ఈ సీజన్ లో చిన్న పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. వాటి చుట్టూ వెచ్చని వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం బయటి గాలిలో తిప్పడం వల్ల పిల్లలు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీని వల్ల జ్వరం, దగ్గు, తుమ్ములు, తరచుగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు చెబుతున్నారు. చల్లని వాతావరణం నుంచి పిల్లలను రక్షించేందుకు కంగారు మదర్ కేర్ చాలా కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. కంగారు తన బిడ్డను పొట్టలో పర్సులో పెట్టుకున్నట్లు, తల్లి తన బిడ్డను తన ఛాతీపై పడుకోబెట్టడం వల్ల తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డను కాపాడుతుందని చెబుతారు. తల్లిపాలు కూడా సరిగ్గా ఇస్తారని… దానివల్ల పిల్లల బరువు పెరుగుతుందని, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం కంగారూ మదర్కేర్లో పిల్లలను ఉంచాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంతే కాకుండా.. ఇంటిలో న్యుమోనియా బారిన పడకుండా.. ఒక చిన్న బాక్సులో బొగ్గులతో వేడిని చేసి ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దాని వల్ల ఇంట్లో వేడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి రోగబారిన పడకుండా ఉండొచ్చని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా ఇంట్లో వేడి ఉండటం వల్ల పిల్లలకు కూడా వేడి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.
Coronavirus in India: మళ్లీ కరోనా అలజడి.. ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!