Pneumonia Cases: వాతావరణంలో మార్పు.. న్యుమోనియా బారినపడుతున్న పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pneumonia Cases: దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ పెద్ద సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు, 24 గంటల వ్యవధిలో 166 కొత్త వ్యక్తులు కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. వీటిలో అత్యధికంగా 166 కొత్త కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. వాతావరణంలో మార్పుల కారణంగా, చాలా మంది జ్వరం బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న చలి గాలులు, చలితో చిన్న పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, న్యుమోనియా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి లక్షణాలతో ఇప్పటికే 50 మంది హైదరాబాద్లోని నీలోఫర్లో చేరారు. జలుబు, తీవ్రమైన దగ్గు, జ్వరం, గొంతునొప్పితో ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొందరికి 5-6 రోజులైనా జ్వరం తగ్గకపోగా, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే న్యుమోనియాగా గుర్తించి ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. న్యుమోనియా లక్షణాలు కనిపించినప్పుడు యాంటీబయాటిక్స్ స్వీయ-నిర్వహణ చేయకూడదని వైద్యులు సలహా ఇస్తారు.
Read also: IND vs PAK: పాకిస్తాన్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే..!
Also Read
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
- Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ఈ సీజన్ లో చిన్న పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. వాటి చుట్టూ వెచ్చని వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం బయటి గాలిలో తిప్పడం వల్ల పిల్లలు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీని వల్ల జ్వరం, దగ్గు, తుమ్ములు, తరచుగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు చెబుతున్నారు. చల్లని వాతావరణం నుంచి పిల్లలను రక్షించేందుకు కంగారు మదర్ కేర్ చాలా కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. కంగారు తన బిడ్డను పొట్టలో పర్సులో పెట్టుకున్నట్లు, తల్లి తన బిడ్డను తన ఛాతీపై పడుకోబెట్టడం వల్ల తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డను కాపాడుతుందని చెబుతారు. తల్లిపాలు కూడా సరిగ్గా ఇస్తారని… దానివల్ల పిల్లల బరువు పెరుగుతుందని, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం కంగారూ మదర్కేర్లో పిల్లలను ఉంచాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంతే కాకుండా.. ఇంటిలో న్యుమోనియా బారిన పడకుండా.. ఒక చిన్న బాక్సులో బొగ్గులతో వేడిని చేసి ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దాని వల్ల ఇంట్లో వేడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి రోగబారిన పడకుండా ఉండొచ్చని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా ఇంట్లో వేడి ఉండటం వల్ల పిల్లలకు కూడా వేడి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.
Coronavirus in India: మళ్లీ కరోనా అలజడి.. ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు
తాజావార్తలు
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!