Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కస్డడీకి ప్రభాకర్ రావు
- ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- వారం రోజులపాటు కస్టడీకి అనుమతించిన సుప్రీంకోర్టు
- రేపు ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును వెంటనే సిట్ (SIT) ముందు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ వచ్చినప్పటికీ, తాజాగా ఈ రక్షణను తొలగించి, కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసు విషయంలో ప్రభాకర్ రావు విచారణకు ఏ మాత్రం సహకరించట్లేదని తెలంగాణ ప్రభుత్వం తరపున పదేపదే వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ప్రభాకర్ రావు ఇప్పటివరకు దర్యాప్తునకు సహకరించలేదని నిర్ధారించింది. అందువల్ల, కేసులో మరింత లోతైన విచారణ కోసం, ఆయన్ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తూ, తక్షణమే సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
Akhanda 2: అఖండ 2’కి లాస్ట్ మినిట్ షాక్..శ్రీశైలంలో బోయపాటి, తమన్
ప్రభుత్వ తరపు వాదనల్లో ముఖ్యంగా డేటా ధ్వంసం అంశంపై కోర్టు దృష్టి సారించింది. ప్రభాకర్ రావు ఉపయోగించిన డివైస్ల పాస్వర్డ్లను రీసెట్ చేసినప్పటికీ, ఐ-క్లౌడ్లో గానీ, డివైస్లలో గానీ ఎక్కడా ముఖ్యమైన డాటా లభ్యం కాలేదని, అదంతా డిలీట్ అయిందని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, మొత్తం 36 డివైజ్లను పూర్తిగా ధ్వంసం (డిస్ట్రాయ్) చేశారనే తీవ్ర ఆరోపణలు కూడా ప్రభుత్వ వర్గాలు కోర్టు ముందుంచాయి.
ప్రభాకర్ రావు తరపు సీనియర్ కౌన్సిల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ, తమ క్లయింట్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. పై అధికారుల ఆదేశాల ప్రకారమే, కొన్ని రూల్స్కు అనుగుణంగా డివైస్లను ధ్వంసం చేయాల్సి వచ్చిందని ఆయన కోర్టుకు తెలియజేశారు. ప్రభాకర్ రావు సీనియర్ సిటిజన్ అయినందున, విచారణ సందర్భంగా ఆయన గౌరవాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు సిట్ను ఆదేశించింది. ఆయనపై ఎటువంటి శారీరక హింస (physical torture) ప్రయోగించకూడదని, హాని కలిగించకుండా జాగ్రత్తగా విచారణ జరపాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పూర్తిగా ముగించలేదు. విచారణ కొనసాగుతుందని, తదుపరి విచారణ వచ్చే శుక్రవారం రోజున ఉంటుందని తెలిపింది. అప్పటివరకు కేసుకు సంబంధించిన ప్రస్తుత స్టేటస్ రిపోర్ట్ను సిట్ , తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
Indigo Crisis: ప్రయాణికులకు ఇండిగో స్పెషల్ ఆఫర్.. రూ.10వేల ట్రావెల్ వోచర్ ప్రకటన
తాజావార్తలు
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!