ఈటల లాగే మల్లారెడ్డి పై విచారణ జరపాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళిత గిరిజన బిసీ మైనార్టీ లకు లాభం జరగాలనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయంగా నష్టం జరిగినా సోనియా తెలంగాణ ఇచ్చారు. అందుకే రేవంత్ రెడ్డి సోనియాను తెలంగాణ తల్లి అంటున్నారు అని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ దళిత గిరిజనులకు అణచి వెస్తున్నారు. అర్హులైన దళిత గిరిజన అధికారులను ప్రధాన్యత కలిగిన పోస్ట్ లను ఇస్తున్నారు. అగ్రవర్ణాల అధికారులు రిటైర్డ్ అయ్యాక కూడా తిరిగి పోస్ట్ లలో కొనసాగిస్తున్నారు. సీఎం ఆఫీస్ లో పనిచేసే మెజారిటీ ఉన్నత ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులే అని తెలిపారు.
కేసీఆర్ నియంతృత్వ ధోరణి,అణచివేత ధోరణిలోనే అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం వదిలి బయటికి వచ్చారు. ఉన్నత చదువులు చదువుకొని వచ్చిన దళిత గిరిజన ఉద్యోగులను ఇలా అనగా దొక్కడం ఎంత వరకు సమంజసం. బడ్జెట్ లో దళిత గిరిజనుల కు కేటాయించిన నిధులు ఎందుకు.పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు. కేసీఆర్ అవలంభిస్తున్న దళిత గిరిజన అణచివేత చర్యలకు నిరసిస్తూ నే కాంగ్రెస్ దండోరా కార్యక్రమం. రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన దళితుల భూముల ఎందుకు గుంజుకుంటున్నారు. మూడు చింతల పల్లి లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళే రోడ్డు ఎత్తు పెంచడం ద్వారా దళితుల ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఆ గ్రామంలో దళితుల కష్టాలను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో మూడెకరాల భూమి ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వలేదు అని స్పష్టం చేసారు.
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
అయితే ఈ సమస్యలపై రేవంత్ రెడ్డి మాట్లాడితే మంత్రి మల్లా రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు. మంత్రిగా ఉండి ఇష్టం వచ్చినట్లు రేవంత్ పై బూత్ లు మాట్లాడటం సరైందేనా… మల్లారెడ్డి కి చిత్త శుద్ది ఉంటే తనపై వచ్చిన ఆరోపణలకు విచారణ చేయించాలి. ఈటల రాజేందర్ పై విచారణ జరిపినట్లు మల్లారెడ్డి పై విచారణ జరిపించాలి. మల్లారెడ్డి రాజ్యాంగేతర శక్తిలాగా ప్రవర్తిస్తున్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉండేందుకు అర్హుడు కాడు. కేసీఆర్ మల్లారెడ్డి నీ బర్తరఫ్ చేయాలి. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎమ్మెల్యేలు,మంత్రులు చదువుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. దళిత గిరిజనుల కు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!