Nizamabad News: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన.. నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad News: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది. బయట నుంచి లిఫ్ట్ వరకు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిని తీరు అందరిని కలిచివేదసింది. తమ కొడుకు అనారోగ్యంతో వున్నాడని ఆసుపత్రిలో స్ట్రెచర్ కనిపించలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి సిబ్బందిని సహరించాలని కోరినా ఎవరు నోరుమదపలేదని అన్నారు.
దీంతో దిక్కుతోచని స్థితిలో రోగి కాళ్లు పట్టుకుని తీసుకొని వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చకు దారితీస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నిజామాబాద్ ఆస్పత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఆసుపత్రిలో సరైన వసులులేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు మండిపడుతున్నారు. అక్కడికి వెళ్లి వైద్యులు అందుబాటులో ఎవరూ ఉండని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిలో వైద్యులు, స్ట్రెచర్, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో కూడా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్యాసింజర్ ఆటోల్లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అయితే ఈ పరిణామాలపై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. మార్చి 31న పేషెంట్ను ఆస్పత్రికి తీసుకొచ్చారని.. చిట్టితో ఓపీ వచ్చేలోపు లిఫ్ట్ రావడంతో పేషెంట్ను తల్లిదండ్రులు లాక్కెళ్లారని తెలిపారు. 2వ అంతస్తుకు చేరుకున్న రోగిని వీల్ చైర్ లోనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ఏం జరిగిందో తెలియని ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదే జరిగింది కానీ ఇంకేదో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకూడదని విరించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!