Neet Exam: నీట్ పరీక్ష నిబంధనలపై పేరెంట్స్ ఫైర్.. ఇవేం రూల్స్ అంటూ..
Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభమైంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాయడం మొదలుపెట్టారు. అయితే అంతకు ముందు నీట్ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవేం రూల్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముక్కు పుడకలతో ఉన్న బాలికలను పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది గేట్ల వద్దే నిలిపివేశారు. ముక్కు పుడక తీసేయాని లేదంటే లోపలికి రానివ్వమని చెప్పడంతో వాటిని గతిలేక విద్యార్థులు తీసేసి లోపలికి వెళ్లారు. కొందరు విద్యార్థులు రాకపోవడంతో తల్లిదండ్రులు ముక్కుపుడకను కట్ చేశారు. అలాగే ఫుల్ హ్యాండ్స్ వున్న, గాజులు వేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే ఆపేశారు.
పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల హెయిర్ బ్యాండ్లు, గాజులు తొలగించి లోపలికి అనుమతించాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డు మాత్రమే అనుమతించబడుతుంది. ఇలా కాగా కఠిన నిబంధనలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిఇలా ఉంటే మరోవైపు నీట్ పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ ఆలస్యం అవుతోంది. దీంతో విద్యార్థులు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. నీట్ పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటికే విద్యార్థులు ఎలా రావాలని ముందుగానే చెప్పినా స్టూడెంట్స్ అలా రావడం పై సెక్యూరిటీ సిబ్బంది మండిపడ్డారు. ఇలా రాకూడదని అప్లికేషన్ లోనే చెప్పినా అయినా విద్యార్థులు రూల్స్ పాటించకుండా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించకుండా అధికారుల సమయాన్ని వృధా చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఇక NEET పరీక్షకు ఓ విద్యార్థికి నిరాశ ఎదురైంది. భీంసరి శివారులోని ఆర్యభట్ట హైస్కూల్ లో సెంటర్ ఈఘటన జరిగింది. ఆలస్యం కావడంతో పరీక్షకు సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో ఏం చేయలేక కన్నీటితో విద్యార్థి వెనుతిరిగాడు.
Also Read
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో, విదేశాలలో 14 నగరాల్లో నిర్వహించబడుతుంది. ఏపీలో 140 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తుండగా, హైదరాబాద్లో 22 కేంద్రాల్లో నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 11:40 గంటల నుంచి విద్యార్థులను లోనికి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.
Mocha: మోచా తుఫాన్, తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్
తాజావార్తలు
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో