MLA Dharma Reddy: తెలంగాణ అంతా మన వైపు చూసేలా.. భారీ మెజారిటీతో గెలిపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Dharma Reddy: తెలంగాణ అంతా మన వైపు చూసేలా భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం అని చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్ర నడికుడ మండలంలోని చౌటుపర్తి గ్రామంలోఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరకాల నియోజకవర్గ సిఎం కేసీఆర్ గారి సహకారంతో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. మరొక్కసారి ప్రజలంతా దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. మూడవసారి అధికారంలోకి రాగానే మరిన్ని పథకాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేస్తే గ్రామాలు అంధకారంగా మారుతాయని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకని ఎద్దేవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తానని చెప్పారు. దానికి కూడా మీటర్లు పెట్టి కరెంటు బిల్లు వసూలు చేస్తారన్నారని తెలిపారు. రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడి కింద ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని 16 వేలకు పెంచడం జరుగుతుందని గుర్తు చేశారు.
Read also: Nepal : నేపాల్లో పెరిగిన హిందూ రాష్ట్ర డిమాండ్.. అల్లకల్లోలం అక్కడ
Also Read
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
భారతదేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైనా గుజరాత్ లో 700 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. ఇక్కడ 2016 రూపాయలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే 4000 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. బీడీ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆడపడుచులకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని సూచించారు. ఇప్పటికే సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. చిన్న గ్రామాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మన పరకాల మరింత అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ అంతా మన వైపు చూసేలా భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mohan Bhagwat: ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం.. అందరినీ ఆర్యన్లను చేస్తాం..
తాజావార్తలు
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!