Nepal : నేపాల్లో పెరిగిన హిందూ రాష్ట్ర డిమాండ్.. అల్లకల్లోలం అక్కడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal : నేపాల్లో రాచరికం, హిందూ దేశం కోసం డిమాండ్ మళ్లీ తీవ్రమైంది. ఇందుకోసం రాజధాని ఖాట్మండులో గురువారం పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలు, బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనలో పోలీసులకు, ఆందోళనకారులకు స్వల్ప గాయాలయ్యాయి. 2008లో రద్దు చేయబడిన రాచరికం తిరిగి రావాలని, హిందూ దేశంగా నేపాల్ స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు గుమిగూడారు. వీరిలో ఎక్కువ మంది నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర మద్దతుదారులని చెబుతున్నారు. ప్రదర్శనలో జ్ఞానేంద్రకు అనుకూలంగా వారు నిరంతరం నినాదాలు చేశారు.
Read Also:Rashmika Mandanna: రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియో వైరల్.. త్వరలో నిందితుల అరెస్టు
Also Read
‘మాకు రాజరికం కావాలి, గణతంత్రం కాదు’
‘మాకు ప్రాణం కంటే రాజు ముఖ్యమని, మాకు రాచరికం కావాలి, గణతంత్రం కాదు’ అని నిరసనకారులు అన్నారు. నేపాల్ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు మొత్తం పరిపాలనా సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపించారు. అందుకే ఈ విఫలమైన పాలనా వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also:Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా చేయాలా ? మీ అభిప్రాయం ఏంటి ?
2006లో అధికారాన్ని కోల్పోయిన జ్ఞానేంద్ర
కాలం ఎంత మారిపోయిందో, 2006లో అదే రాజు జ్ఞానేంద్ర వీర్ విక్రమ్ షా దేవ్ అధికారంలో ఉండగా, ఆయనకు వ్యతిరేకంగా అనేక వారాల పాటు వీధుల్లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. అప్పటి రాజు జ్ఞానేంద్ర తన పాలనను వదులుకుని ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవలసి వచ్చింది. రెండు సంవత్సరాల తరువాత, కొత్తగా ఎన్నికైన పార్లమెంటు రాచరికాన్ని రద్దు చేయడానికి ఓటు వేసింది. నేపాల్ గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. రిపబ్లిక్ అర్థం ఏమిటంటే, దేశానికి అధిపతి అధ్యక్షుడు, రాజు కాదు. తర్వాత నేపాల్ను హిందూ దేశంగా కాకుండా సెక్యులర్గా ప్రకటించారు. ఇది తాత్కాలిక రాజ్యాంగం సహాయంతో జరిగింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!