Palvai Sravanthi: మణిపూర్ అల్లకల్లోలంపై ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palvai Sravanthi Fires On PM Narendra Modi Over Manipur Violence: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. 80 రోజులుగా మణిపూర్ అట్టుడుకుతుంటే.. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్ వద్ద పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. మణిపూర్లో ఏం జరగనట్టు ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని, మణిపూర్ అల్లకల్లోలంపై ఇంతవరకూ మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆదివాసీ తెగల మీద బీజేపీ చిచ్చుపెట్టిందని విమర్శించారు.
Ponguleti Srinivas Reddy: చిత్తశుద్దితో హస్తం గుర్తుపై ఓట్లు పడేలా కృషి చేస్తాం
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
మణిపూర్ ముఖ్యమంత్రి ఇలాంటి ఘటన జరగడం ఇదొక్కటే కాదని, వందల సంఖ్యలో జరుగుతుంటాయని చెప్పడం.. బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని పాల్వాయి స్రవంతి ధ్వజమెత్తారు. ఈ సంఘటన మే 3వ తేదీన జరిగితే, రెండు నెలల తర్వాత వీడియో బయటకొచ్చాక తాను భావోద్వేగానికి గురవుతున్నానని చెప్పడం సిగ్గుచేటు అని నిప్పులు చెరిగారు. బీజేపీ మహిళా మంత్రి స్మృతి ఇరానీకి గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడంలో ఆసక్తి మణిపూర్ ఘటనపై లేదని కౌంటర్ వేశారు. బీజేపీలో ఉన్న మహిళా నాయకత్వం ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు. బీజేపీ మహిళా నాయకత్వం ఇప్పటికైనా మణిపూర్ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Srinivas Goud: కల్తీ మద్యంపై తొలి పీడీ యాక్ట్.. కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్
అలాగే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఈషాన్య రాష్ట్రాల మరణాహోమం కనిపించడం లేదా? అని పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు. రాజస్థాన్లో దళిత మహిళపై అత్యాచారం జరిగితే 24 గంటల్లోనే పట్టుకున్నారని, కానీ మణిపూర్ ఘటనపై 80 రోజులుగా ఏ ఒక్కరూ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కంటే మణిపూర్ అల్లకల్లోలం తక్కువేనని అనడం, బీజేపీ ఏంటో అర్థమవుతుందన్నారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికుడి కుటుంబానికే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!