NVSS Prabhakar:తండ్రి కొడుకుల వల్ల పురపాలక శాఖ భ్రష్టు పట్టి పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి కొడుకుల వల్ల పురపాలక శాఖ భ్రష్టు పట్టి పోయిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్ మండి పడ్డారు. అమిత్ షా సభ తర్వాత TRS నేతలకు నిద్ర పట్టడం లేదు, తినడం లేదని ఎద్దేవ చేశారు.
బంగారు గిన్నెలో జీవితం ప్రారంభించిన కేటీఆర్ కి పేద ప్రజల కష్టాలు తెలుస్తాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత అవినీతి, అసమర్థ , బాధ్యత రహిత్య మంత్రి కేటీఆర్ అంటూ మండి పడ్డారు.
ఏసీబీ ట్రాప్ చేసిన వారిలో ఎక్కువ మంది పురపాలక శాఖ కు చెందిన ఉద్యోగులే వున్నారని విమర్శించారు. ఈయన మంత్రిత్వ శాఖలోనే కుంభకోణాలు చెవిచూసాయని విరుచుకుపడ్డారు. ప్రపంచ దేశాలచే ప్రశంసించబడుతున్న వ్యక్తి మోడీ అని తెలిపారు.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ఆయననా మీరు విమర్శించేది అంటూ మండి పడ్డారు. కెసిఆర్ కేబినెట్ లో పనికి రాని, పని లేని మంత్రులు ఉన్నారని నిప్పులు చెరిగారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో అబద్దం ఏముంది? అని ప్రశ్నించారు. వంచించడం, మోసం చేయడం కెసిఆర్ కుటుంబానికే చెల్లిందని మండిపడ్డారు.
హాస్పిటల్స్ లో 5 రూపాయల భోజనం పెట్టాలనేది 8 సంవత్సరాల తర్వాత గుర్తుకు వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. బిజెపి నీ విమర్శిస్తే సహించేది లేదు… వెంట పడి తరిమి తరిమి కొడతాం అంటూ Nvss ప్రభాకర్ మండిపడ్డారు.
కాగా.. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తెలంగాణ పోలీసు వ్యవస్థపై, సీఎం కేసీఆర్ పై (మే-5)న సంచళన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా.. మూలాలు మాత్రం తెలంగాణలో..కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఉగ్రవాద ఏమూల జరుగుతున్నా.. దాని మూలాలు మాత్రం తెలంగాణలో ఎందుకు ఉంటున్నాయో.. దీనికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారు తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు.
ఎన్నో కేసులతో సంబందం ఉన్న MIM నేతలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణం ప్రభుత్వం, పోలీసులే అని ఆరోపించారు. MIM నేతలను కాపాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ తెలీనట్లు నటిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలంతా టిఆర్ఎస్ ఆగడాలను గమనిస్తోందని అన్నారు. త్వరలో ప్రజలే టిఆర్ఎస్ బుద్దిచెప్పే రోజులు వస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mim తో TRS మైత్రి తెలంగాణకు చాలా ప్రమాదకరంగా మారిందని మండిపడ్డారు. మే 14 సరికొత్త మార్పునకు పునాది కాబోతుందని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి అమిత్ షా వస్తున్నారని గుర్తు చేశారు. ఈసభలో కెసిఆర్ ను.. రైతు, యువజన, దళిత, బలహీన వర్గాల, తెలంగాణ ద్రోహిగా నిలబెట్ట బోతున్నామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లు.. కేసీఆర్ ను కాపాడలేవని ఎద్దేవ చేశారు. మధ్యంతరానికి అయిన, ముందస్తుకు అయిన మేము సిద్దంగా వున్నామని సవాల్ విశిరారు.
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!