NVSS Prabhakar: మోడీ వస్తే చాలు కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NVSS Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రధాని రూ. 11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించారు, ఇది కేసీఆర్ కు కంటగింపుగా ఉన్నట్లుంది, అందుకే కేసీఆర్ గైర్హాజరయ్యారని ఆరోపించారు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరని అన్నారు. రాజకీయ దుర్భుద్ధి కారణంగానే కేసీఆర్ మోడీకి స్వాగతం పలకలేదని, కనీసం అభివృద్ధి పనుల్లోనూ పాల్గొనలేదని దుయ్యబట్టారు. ఈ విషయంలో కేసీఆర్ తన తప్పు అయిందని ఒప్పుకుని చెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: 50 years of Project Tiger: దేశంలో పులుల సంఖ్యని ప్రకటించిన ప్రధాని మోడీ..
Also Read
- CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
- CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
- Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
- CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..
ప్రధాని మోడీ వస్తే చాలు సీఎం కేసీఆర్ తప్పించుకు తిరుగుతన్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచ స్థితికి దిగజారలేదని అన్నారు. మమత బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, జగన్ సైతం విమర్శలు చేశారు.. కానీ అభివృద్ధి పనుల్లో ప్రారంభోత్సవాల్లో భాగస్వాములయ్యారని, వాళ్లను చూసి నేర్చుకోవాలని కేసీఆర్ కు సూచించారు. మోడీ సభ అనంతరం బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు, కానీ కల్వకుంట్ల కుటుంబం ఎక్కడా కూడా మోడీని విమర్శించే ధైర్యం చేయలేదని అన్నారు. అలా చేస్తే మీది కుటుంబ పాలన అనేది స్పష్టం అవుతుందని ట్విట్టర్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఆదేశానుసారం మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు తప్పితే.. మనస్ఫూర్తిగా ఎవరూ విమర్శించలేదని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రశ్నించడం సిగ్గుచేటని, ఆజాంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హమీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. కొత్త పరిశ్రమలను కూడా మూసేయించి ఆ భూములపై కేసీఆర్ బిడ్డ, కొడుకు కన్నేశారని ఆరోపించారు. విభజన హామీలు నెరవేరకుండా అడ్డుకుంటున్నది కేసీఆరే అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఏనాడైనా లిక్కర్ కేసు, లీక్ కేసుపై మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని.. పక్క రాష్ట్రాలకు కేటాయించినన్ని నిధులు తెలంగాణకు కేటాయించడం లేదని విమర్శలు చేస్తున్నారని అలా అయితే తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో తప్పితే ఇతర నియోజవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!