NVSS Prabhakar: మోడీ వస్తే చాలు కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NVSS Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రధాని రూ. 11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించారు, ఇది కేసీఆర్ కు కంటగింపుగా ఉన్నట్లుంది, అందుకే కేసీఆర్ గైర్హాజరయ్యారని ఆరోపించారు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరని అన్నారు. రాజకీయ దుర్భుద్ధి కారణంగానే కేసీఆర్ మోడీకి స్వాగతం పలకలేదని, కనీసం అభివృద్ధి పనుల్లోనూ పాల్గొనలేదని దుయ్యబట్టారు. ఈ విషయంలో కేసీఆర్ తన తప్పు అయిందని ఒప్పుకుని చెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: 50 years of Project Tiger: దేశంలో పులుల సంఖ్యని ప్రకటించిన ప్రధాని మోడీ..
Also Read
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
ప్రధాని మోడీ వస్తే చాలు సీఎం కేసీఆర్ తప్పించుకు తిరుగుతన్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచ స్థితికి దిగజారలేదని అన్నారు. మమత బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, జగన్ సైతం విమర్శలు చేశారు.. కానీ అభివృద్ధి పనుల్లో ప్రారంభోత్సవాల్లో భాగస్వాములయ్యారని, వాళ్లను చూసి నేర్చుకోవాలని కేసీఆర్ కు సూచించారు. మోడీ సభ అనంతరం బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు, కానీ కల్వకుంట్ల కుటుంబం ఎక్కడా కూడా మోడీని విమర్శించే ధైర్యం చేయలేదని అన్నారు. అలా చేస్తే మీది కుటుంబ పాలన అనేది స్పష్టం అవుతుందని ట్విట్టర్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఆదేశానుసారం మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు తప్పితే.. మనస్ఫూర్తిగా ఎవరూ విమర్శించలేదని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రశ్నించడం సిగ్గుచేటని, ఆజాంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హమీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. కొత్త పరిశ్రమలను కూడా మూసేయించి ఆ భూములపై కేసీఆర్ బిడ్డ, కొడుకు కన్నేశారని ఆరోపించారు. విభజన హామీలు నెరవేరకుండా అడ్డుకుంటున్నది కేసీఆరే అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఏనాడైనా లిక్కర్ కేసు, లీక్ కేసుపై మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని.. పక్క రాష్ట్రాలకు కేటాయించినన్ని నిధులు తెలంగాణకు కేటాయించడం లేదని విమర్శలు చేస్తున్నారని అలా అయితే తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో తప్పితే ఇతర నియోజవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!