NVSS Prabhakar: మోడీ వస్తే చాలు కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NVSS Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రధాని రూ. 11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించారు, ఇది కేసీఆర్ కు కంటగింపుగా ఉన్నట్లుంది, అందుకే కేసీఆర్ గైర్హాజరయ్యారని ఆరోపించారు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరని అన్నారు. రాజకీయ దుర్భుద్ధి కారణంగానే కేసీఆర్ మోడీకి స్వాగతం పలకలేదని, కనీసం అభివృద్ధి పనుల్లోనూ పాల్గొనలేదని దుయ్యబట్టారు. ఈ విషయంలో కేసీఆర్ తన తప్పు అయిందని ఒప్పుకుని చెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: 50 years of Project Tiger: దేశంలో పులుల సంఖ్యని ప్రకటించిన ప్రధాని మోడీ..
Also Read
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ప్రధాని మోడీ వస్తే చాలు సీఎం కేసీఆర్ తప్పించుకు తిరుగుతన్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచ స్థితికి దిగజారలేదని అన్నారు. మమత బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, జగన్ సైతం విమర్శలు చేశారు.. కానీ అభివృద్ధి పనుల్లో ప్రారంభోత్సవాల్లో భాగస్వాములయ్యారని, వాళ్లను చూసి నేర్చుకోవాలని కేసీఆర్ కు సూచించారు. మోడీ సభ అనంతరం బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు, కానీ కల్వకుంట్ల కుటుంబం ఎక్కడా కూడా మోడీని విమర్శించే ధైర్యం చేయలేదని అన్నారు. అలా చేస్తే మీది కుటుంబ పాలన అనేది స్పష్టం అవుతుందని ట్విట్టర్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఆదేశానుసారం మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు తప్పితే.. మనస్ఫూర్తిగా ఎవరూ విమర్శించలేదని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రశ్నించడం సిగ్గుచేటని, ఆజాంజాహీ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హమీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. కొత్త పరిశ్రమలను కూడా మూసేయించి ఆ భూములపై కేసీఆర్ బిడ్డ, కొడుకు కన్నేశారని ఆరోపించారు. విభజన హామీలు నెరవేరకుండా అడ్డుకుంటున్నది కేసీఆరే అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఏనాడైనా లిక్కర్ కేసు, లీక్ కేసుపై మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని.. పక్క రాష్ట్రాలకు కేటాయించినన్ని నిధులు తెలంగాణకు కేటాయించడం లేదని విమర్శలు చేస్తున్నారని అలా అయితే తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో తప్పితే ఇతర నియోజవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..