Nizamabad Crime: నిజామాబాద్లో ఘరానా మోసం.. 18 పౌండ్ల కోసం రూ.2.75 లక్షల ఫ్రాడ్..
- నిజామాబాద్లో ఇంగ్లాండ్ కరెన్సీ పేరిట సైబర్ మోసం..
- ఆన్ లైన్ లో ఇంగ్లాండ్ కరెన్సీ పంపుతమంటూ సంతోష్ కు ఎరా..
- 18 పౌండ్ల కోసం రూ.2.75 లక్షలు చెల్లించిన బాధితుడు....
- మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad Crime: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల బెడద పెరుగుతోంది. సోషల్ మీడియా, పార్ట్ టైమ్ జాబ్స్, ఫిషింగ్, ఫేక్ కస్టమర్ కేర్, లోన్ యాప్ వేధింపులు, ఉద్యోగం, వీసా, రుణాలు, గిఫ్ట్, లాటరీ మోసం, డేటా చోరీ, ఓఎల్ఎక్స్, క్వికర్, ఇతర మార్కెటింగ్ కంపెనీలు, క్రిప్టో పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. పెట్టుబడి, మ్యాట్రిమోని, ఇతర రకాల సైబర్ నేరాలతో బాధితుల ఫిర్యాదుతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక రకం సైబర్ మోసం వెలుగు చూసేలోపు మరొక రకం సైబర్ నేరాలకు తెరలేపుతున్నారు సైబర్ కేటుగాళ్లు. దీంతో దీనిపై దృష్టి సారించిన పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. అమాయకులను టార్గెట్ చేస్తూ సైబర్ కేటు గాళ్లు దోచుకుంటూ కొత్తతరం నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే నిజామాబాద్ లో చోటుచేసుకుంది.
Read also: Hyderabad Crime: భార్య భర్తల దొంగ అవతారం.. మెచ్చుకున్నారో మొత్తం దోచేస్తారు
Also Read
నిజామాబాద్ జిల్లా ఎల్లంపేటకు చెందిన సంతోష్ కు ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ఇంగ్లాండ్ కరెన్సీ పేరిట సంతోష్కు మాటలు కలిపాడు, నమ్మంచాడు. ఆన్ లైన్ లో ఇంగ్లాండ్ కరెన్సీ పంపుతమంటూ సంతోష్ కు తెలిపాడు. ఇంగ్లాండ్ కరెన్సీ అంటే ఇక్కడ భారీగా గిరాకీ ఉంటుందని నమ్మించడంతో డబ్బులకు ఆశపడ్డ సంతోష్ ఆలోచన లేకుండా సైబర్ కేటుగాళ్లకు విడదల వారీగా రూ.2.75లక్షలు పంపాడు. ఆతరువాత సంతోష్కు ఇంగ్లాండ్ కరెన్సీని ఆన్ లైన్ లో పంపామని చెప్పడంతో సంతోసంతో ఆన్ లైన్ లో చూడగా బిత్తర పోయాడు. ఆన్ లైన్ ద్వారా అతనికి 18 పౌండ్లు మాత్రమే ఉండటంతో వాళ్లకు కాల్ చేశాడు. స్పందన లేకపోవడంతో.. మోసపోయానని భావించిన సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?