Hyderabad Crime: భార్య భర్తల దొంగ అవతారం.. మెచ్చుకున్నారో మొత్తం దోచేస్తారు
- దొంగలుగా మారుతున్న భార్యాభర్తలు..
- యజమాని మెప్పు పొంది దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు..
- బీహారీ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ..
- ఈ రెండు జంటల నుండి చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: ఇంట్లో పనిచేస్తామంటారు.. నమ్మకంగా ఉంటామంటారు. వారి మాటలతో ఎదుటి వారిని మెప్పిస్తారు. ఇంటి పనికి ఒప్పుకుని ఇంట్లో వస్తువులపై నిఘా పెడతారు. సందుచూసుకుని అన్నీ దోచుకుని పరార్ అవుతారు. భార్య బాటలో భర్త.. భర్త అడుగు జాడల్లో భార్య అంటే ఇదే నేమో మరి. ఇద్దరు పనికి చేరి కొద్దిరోజులు నమ్మకంగా ఉండి ఇంట్లో వున్న సొత్తును మొత్తం దోచుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు. లబో దిబో మంటూ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సవాల్గా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలుగా మారి దోచుకుంటున్న భార్యాభర్తలను అదుపులో తీసుకున్నారు.
Read also: Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య..
Also Read
రాజేంద్రనగర్, బండ్లగూడ, మ్యాపిల్ టౌన్షిప్ విల్లాలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ ముగ్గురి ఇండ్లలో చోరీకి పాల్పడింది దంపతులు అని అనుమానంతో ఆరా తీయగా పోలీసులకు నిర్ఘాంత పోయే నిజాలు బయట పడ్డాయి. రాజేంద్రనగర్లో కొండల్ రెడ్డి అనే వ్యక్తి డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన ఇంట్లో పనుల కోసం బీహారీకి చెందిన సలీం, జకియా సుల్తానాలను దంపతులు పని మనుషులుగా పెట్టుకున్నారు. కొద్ది రోజులు బాగానే నమ్మకంగా ఉండటంతో దీంతో వైద్యులు వారిని పూర్తీగా నమ్మాడు. ఇంత నమ్మకంగా వున్న బీహారీ దంపతులు దొంగతనం చేస్తారని ఊహించలేకపోయాడు. ఇదే అలుసుగా భావించిన బీహారీ దపంతులు ఒకరోజు దొంగతనానికి పాల్పడ్డారు.
Read also: Medak Tour: నేడు మెదక్ జిల్లాలో ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, సీఎం రేవంత్రెడ్డి పర్యటన..
ఒకటి కాదు రెండు కాదు ఇంట్లో మొత్తం వున్న రూ.45 లక్షల రూపాయల విలువైన డైమండ్ గొలుసు, బంగారు, వెండి ఆభరణాలతో పాటు 55వేల నగదును చోరీ చేసి పారిపోయారు. ఇంటికి వచ్చిన వైద్యుడు ఇంట్లో సొత్తు మొత్తం ఖాళీ అయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిని ఇంటికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే బీహారీ దొంగల కేసు దర్యాప్తులో వుండగా మరోవైపు పాతబస్తీలోని కాలపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు బీహారీ దంపతులను అదుపులో తీసుకున్నారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
వారి వద్ద నుంచి సుమారు 40 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. దంపతులను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో రాజేంద్రనగర్, బండ్లగూడ, మ్యాపిల్ టౌన్షిప్ విల్లాలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేధించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. వీరి ఇంకా ఎక్కడెక్కడ చోరీ చేశారనే దానిపై ఆరా తీస్తు్న్నారు. రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు. పనిలో పెట్టుకునే ముందు యజమానులు అలర్ట్గా ఉండాలని సూచించారు.
PV Sindhu Reception: కనులవిందుగా సింధు, సాయి రిసెప్షన్.. అతిథులుగా అగ్ర తారలు!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!