Fact Check on Cm jagan: సీఎం జగన్ కి అవమానం జరగలేదు..వాస్తవం ఇదీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగిదంటూ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు Fact Check అంటూ వివరణ ఇచ్చింది. విశాఖలో సభా వేదిక వద్ద సీఎం కు అవమానం అంటూ దుష్ప్రచారాలు. ప్రధాని సీఎంకు గౌరవం ఇస్తే. అవమానమంటూ తప్పుడు ప్రచారాలు. వేదిక పైకి వెళ్లేందుకు ప్రధానికి ఒక మార్గం, సీఎం, గవర్నర్లకు మరో మార్గం ఏర్పాటు. ప్రధానితో ఉన్న సీఎం, గవర్నర్ తమ మార్గం వైపుకు తిరగగా. వారిని తనతో రమ్మని ఆహ్వానించిన ప్రధాని అప్పటికే తమ మార్గం వైపునకు తిరిగిన సీఎం జగన్. ప్రధాని తనతో రమ్మంటున్నారంటూ సీఎంకు సంకేతం ఇచ్చిన ఎస్పీజీ సిబ్బంది. దీంతో ప్రధానితో కలసి వేదికపైకి వెళ్లిన సీఎం, గవర్నర్.. అంటూ వివరించింది.
Read Also: CM Jagan: అక్కడ సముద్రం.. ఇక్కడ జన సముద్రం
Also Read
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
విశాఖ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు జగన్ పాల్గొన్నారు. ప్రధాన స్టేజ్ పైన ప్రధానమంత్రి మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లకు మాత్రమే అవకాశం కల్పించారు. మిగిలిన నేతలకు మరో స్టేజ్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని మోడీ పర్యటనలో జగన్ కి అవమానం జరిగిందని, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు ప్రచారం అయ్యాయి. ఇవి వాస్తవం కాదని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొంది.
విశాఖలో సభా వేదిక వద్ద సీఎం కు అవమానం అంటూ దుష్ప్రచారాలు. ప్రధాని సీఎంకు గౌరవం ఇస్తే. అవమానమంటూ తప్పుడు ప్రచారాలు
వేదిక పైకి వెళ్లేందుకు ప్రధానికి ఒక మార్గం, సీఎం, గవర్నర్లకు మరో మార్గం ఏర్పాటు. 1/2 pic.twitter.com/Ma7o4OyUf4
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) November 12, 2022
ఇదిలా వుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం జగన్ ప్రజల ఆకాంక్షలను మోడీకి విస్నష్టంగా వివరించారు. ఈ పర్యటనలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని సీఎం జగన్ శనివారం అభినందించారు. విశాఖలో ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా డీజీపీ.. సీనియర్ ఐపీఎస్ల నేతృత్వంలో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. డీజీపీ పర్యవేక్షణలో తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నగర పర్యటన, రోడ్ షోకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖను సీఎం అభినందించారని డీజీపీ కార్యాలయం తెలిపింది.
Read Also: Pet Dog Menace: పెంపుడు కుక్క దాడి చేస్తే యజమానికి రూ.10 వేల జరిమానా.. ఎక్కడంటే?
తాజావార్తలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!