MLA Maheshwar Reddy: పేద భూములను కబ్జా చేసిన వారిని విడిచి పెట్టేది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్ సభ్యులను కాదని అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్గా నియమించడం ఎంతమాత్రం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం, మజ్లీస్ పార్టీ మెప్పు కోసం, కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Komatireddy Rajagopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవు.. ఎవరి మాట వినా..
Also Read
ప్రభుత్వం సభ సంప్రదాయాలను ఉల్లంఘించడం వల్లనే బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన సభ్యులు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయలేరని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో ఎంఐఎం, బీజేపీ దోస్తులని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని.. ప్రస్తుతం ఆ పార్టీ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకే రక్తమని, మూడు పార్టీలు ఒకే నావపై ప్రయాణం చేస్తున్నాయి ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రొటెం స్పీకర్ నియమించడంపై వ్యతిరేకించి అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపామని ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నెల 14న దళిత బిడ్డ, స్పీకర్ గా నియమితులైన ప్రసాద్ సమక్షంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు.
Read Also: Siddipet: గూగుల్ మ్యాప్ తెచ్చిన ముప్పు.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లిని డీసీఎం వ్యాన్
నిర్మల్ లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని డీ1 పట్టాలు చేసిన జాబితా సిద్ధంగా ఉందని, ఒక్కొక్కటి బయటకు తీస్తామని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పేద భూములను కబ్జా చేసిన వారిని విడిచి పెట్టేది లేదని, దీనిపై కమిషన్ వేసి నిజానిజాలను బయటకు తీస్తామని పేర్కొన్నారు. భూ అక్రమలపై అసెంబ్లీలో గళమెత్తుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసపూరిత మేనిఫెస్టోను రూపొందించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే హర్షిస్తామని, లేనట్లయితే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Iran vs America: అప్పుడు గులాబీలు.. ఇప్పుడు బాంబులు.. ప్రపంచాన్ని హత్తుకున్న ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఇదే!
-
ASUS Chromebook: మూడు క్రోమ్బుక్లను విడుదల చేసిన ఆసుస్.. స్క్రీన్ను విడదీసి టాబ్లెట్గా మార్చుకోవచ్చు.. తక్కువ ధరకే
-
CJP Protest: నేడు హైదరాబాద్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా.. సోనమ్ వాంగ్చుక్ హాజరు!
-
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
-
SURIYA : సూర్య 50.. కథ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!