NIMS: నిమ్స్లో ఉచిత గుండె ఆపరేషన్లు..!
- పుట్టుకతో గుండె వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్ ఉచిత శస్త్రచికిత్సలు
- సెప్టెంబర్ 1 నుండి 21 వరకు ప్రత్యేక వైద్య శిబిరం
- బ్రిటన్ వైద్యుల సహకారంతో ఆపరేషన్లు
- ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా మొత్తం ఖర్చు భారం రాష్ట్ర ప్రభుత్వమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIMS: మన సమాజంలో అత్యంత బాధ కలిగించే నిజం ఏమిటంటే, పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో చిన్నారులు బాధపడటం. ఆర్థికంగా బలమైన కుటుంబాలు పెద్ద ఆసుపత్రుల్లో ఆధునిక చికిత్స పొందగలిగినా, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రాణాలను కాపాడటానికి ఆర్థిక సహాయం కోసం ఇతరులను వేడుకోవాల్సి వస్తోంది.
OG : ఓజీ స్టోరీ ఇదేనట.. కథలో ఇంత డెప్త్ ఉందా..
Also Read
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు నిమ్స్లో ప్రత్యేక శిబిరం నిర్వహించబడుతుంది. బ్రిటన్ వైద్యుల సహకారంతో ఈ శిబిరంలో చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ముందుగా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమైన వారికి తక్షణమే ఆపరేషన్లు చేస్తారని తెలిపారు.
ఈ శస్త్రచికిత్సలకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా భరిస్తోంది. అంటే తల్లిదండ్రులకు ఒక్క రూపాయి భారమూ పడదని నిమ్స్ అధికారులు హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ బీరప్ప వివరాల ప్రకారం, నిమ్స్ ఆసుపత్రి పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో డా. అమరేష్ రావు, డా. ప్రవీణ్, డా. గోపాల్ వంటి నిపుణ వైద్యులు పిల్లలను పరీక్షించనున్నారు. ప్రతి మంగళవారం, గురువారం, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పిల్లల తల్లిదండ్రులు అంతకుముందు తీసుకున్న రిపోర్టులు, సీటీస్కాన్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆసుపత్రి అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..