మన సమాజంలో అత్యంత బాధ కలిగించే నిజం ఏమిటంటే, పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో చిన్నారులు బాధపడటం. ఆర్థికంగా బలమైన కుటుంబాలు పెద్ద ఆసుపత్రుల్లో ఆధునిక చికిత్స పొందగలిగినా, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి.
అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్తే బ్లడ్ క్యాన్సర్ అని పరీక్షల్లో తేలడంలో.. తల్లిదండ్రుల జీవితాలు పిడుగుపడినట్టు అయ్యింది.. పాపను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు రూ.లక్షలు వెచ్చించారు. విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో పాప చికిత్సకు రూ. 8 లక్షలు మంజూరు చేశారు. అయితే, వ్యాధి ముదరడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఆమె చికిత్సకు గతంలో చేసిన వ్యయానికి సంబంధించి మరో రూ.7 లక్షలను సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేయాలని సీఎం…
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం... అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.830 కోట్లు సీఎంఆర్ఎఫ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో లబ్ధి పొందాయి.
ఇటీవల భారీ వర్షాల బీభత్సానికి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. అయితే.. ముంపు బాధితులను ఆదుకోవడానికి తమకు తోచినంత ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. కుమారీ ఆంటీ తన కుమార్తెతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 వేల చెక్కును అందజేశారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20లక్షలు విరాళం అందజేసింది టెక్నో పెయింట్స్ సంస్థ.…
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించడంతో ఎంతో మంది నిరాష్రులయ్యారు. వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా.. వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు అందజేసింది. ఈ సవాలు సమయాల్లో, మన రాష్ట్రం వరదల వినాశకరమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, కలిసి వచ్చి నష్టపోయిన వారిని ఆదుకోవడం మన సమిష్టి బాధ్యత.…
CMRF Scam: తాజాగా CMRF స్కాం పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు సృష్టించాయి ఆసుపత్రులు. ఈ నేపథ్యంలో 28 ఆసుపత్రుల పైన కేసులు నమోదు చేసింది సిఐడి. ఈ కేసులో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. 30 ఆస్పత్రులు నకిలీ పిల్లలతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని ఆరోపణలు వచ్చాయి. 30 ఆసుపత్రులు కలిసి వందల కోట్ల రూపాయల సీఎంఆర్ నిధులు స్వాహా…
CMRF Applications: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించాలని నిర్ణయించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ కావడం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది.. అయతే, గతంలో వెలుగు చూసిన సీఎంఆర్ఎఫ్ కుంభకోణం విచారణలో స్పీడ్ పెంచింది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. సీఎంఆర్ఎఫ్ విభాగంలో కొంత మందిని గతంలోనే విచారించిన ఏసీబీ అధికారులు.. గతంలో జరిపిన విచారణకు హాజరు కాని మరొ కొందరు సిబ్బందని ఇప్పుడు ప్రశ్నిస్తోంది.. గతంలో విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి విచారణకు పిలిచింది ఏసీబీ.. మరోవైపు.. ఈ కేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ.. ఇప్పటికే నలుగురిని అరెస్ట్…