Robbery in Kukatpally: వాచ్మెన్గా చేరాడు.. రూ.. 55 లక్షల సొత్తుతో పరార్ అయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని కూకట్పల్లిలోని వివేకానంద కాలనీలో భారీ చోరీ జరిగింది. వాచ్మెన్గా పనిచేస్తున్న నేపాలీ దంపతులు పనిచేస్తున్న ఇంటికే కన్నమేసి భారీగా నగదు, బంగారం ఎత్తుకుపోయాయిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెలితే.. కూకట్పల్లి వివేకానంద కాలనీలో నివాసముండే వడ్డేపల్లి దామోదర్రావు ఇంట్లో నేపాల్కి చెందిన చక్రధర్ అనే వ్యక్తి వాచ్మెన్గా చేరాడు.. తనతో పాటు భార్య సీత, మూడేళ్ల కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అయితే.. చక్రధర్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తుండటంతో.. దామోదర్రావు కుటుంబం అతడిని పూర్తిగా నమ్మింది. దీంతో.. చక్రధర్ ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతూ నగదు.. బంగారం ఎక్కడ దాస్తారో తెలుసుకున్నాడు.
read also: Super Moon: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న “సూపర్ మూన్”
Also Read
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
అయితే.. ఈ నేపథ్యంలోనే బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నామని చెప్పి చక్రధర్ భార్యాబిడ్డతో కలిసి ఈ నెల ఆరో తేదీన నాగ్పూర్ వెళ్లాడు. తిరిగివచ్చే సమయంలో తనతో పాటు మరో వ్యక్తిని తీసుకొచ్చాడు. నిన్న( మంగళవారం) రాత్రి 8 గంటల సమయంలో దామోదర్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి కొంపల్లిలో ఓ ఫంక్షన్కి వెళ్లారు. దీంతో.. అదే అదనుగా భావించిన చక్రధర్ తన సహాయకుడితో కలిసి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో వున్న రూ.30లక్షల నగదు, రూ.25లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని కుటుంబంతో సహా ఆటోలో పరారయ్యాడు. ఈనేపథ్యంలో.. ఫంక్షన్ నుంచి తిరిగొచ్చిన దామోదర్ ఇంటి తలుపులు , లాకర్ తెరిచి ఉండటంతో వెళ్లి చూడగా అందులోని డబ్బు, బంగారం కనిపించలేదు. ఇంటి ఓనర్ వెంటనే.. కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. నిందితులు లక్డీకాపూల్ వైపు వెళ్లారని గుర్తించి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను దొంగల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!