Presidential Polls 2022: ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన రద్దు.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ హైదరాబాద్లో పర్యటించాల్సి ఉన్నా.. తన పర్యటనను రద్దుచేసుకున్నారామె.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్కి ఆమె చేరుకోవాల్సి ఉంది.. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రాష్ట్రపతి అభ్యర్థికి ఘనస్వాగతం పలికిచేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది.. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సోమజిగూడలోని ఓ హోటల్లో మేధావులతో సమావేశం, ఆ తర్వాత బీజేపీ ముఖ్యనేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు.. తిరిగి రాత్రి 7.40 గంటలకు తిరిగి వెళ్లే విధంగా షెడ్యూల్ రూపొందించారు.. కానీ, చివరి గంటల్లో ఆమె పర్యటన వాయిదా వేసుకున్నారు.. సమయాభావం వల్ల ద్రౌపది ముర్ము తెలంగాణకు రాలేకపోతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న ద్రౌపది ముర్ము… సమయాభావం వల్ల హైదరాబాద్ రాలేకపోతున్నట్టు చెబుతున్నారు..
Read Also: Andhra Pradesh: నేటి నుంచి సింహాచలంలో గిరి ప్రదక్షిణలు.. 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం
Also Read
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
- Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
- Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
- CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
మరోవైపు, ఇవాళ ఏపీలో పర్యటించనున్నరు ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోన్న ఆమెకు బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు.. రాష్ట్రపతి అభ్యర్థికి తేనీటి విందు ఇవ్వనున్నారు సీఎం జగన్.. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కానున్నారు. మరోవైపు, ఇప్పటికే ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తెలంగాణ పర్యటన వాయిదా పడడంతో.. దాదాపు ఆమె హైదరాబాద్ పర్యటన రద్దు అయినట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే.. ఆమె మరిన్ని రాష్ట్రాల్లో పర్యటించాల్సింది ఉంది.. సమయం లేదు కాబట్టి.. ఆమె ఇక హైదరాబాద్ రాకపోవచ్చు అనే చర్చ సాగుతోంది.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పటికే విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది.. ఆయనను హైదరాబాద్కు రప్పించి ఘనస్వాగతం పలికింది. తెలంగాణ నుంచి ఎన్డీఏ అభ్యర్థికి పడే ఓట్లు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో.. హైదరాబాద్ పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కాగా, భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 18వ తేదీన జరగనున్నాయి.. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాజావార్తలు
-
Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
-
CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
-
Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!