Andhra Pradesh: నేటి నుంచి సింహాచలంలో గిరి ప్రదక్షిణలు.. 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం పుణ్యక్షేత్రంలో నేటి నుంచి సింహగిరి ప్రదక్షిణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కొండ చుట్టూ 32 కి.మీ.మేర భక్తులు ప్రదక్షిణ చేస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఈ గిరి ప్రదక్షిణలో దాదాపు 4 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. వారికి ఇబ్బంది కలగకుండా అధికారులు పలు చోట్ల మంచినీరు, మెడికల్ క్యాంపులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవస్థాన ప్రచార రథం ప్రారంభమవుతుంది. గిరి ప్రదక్షిణ సందర్భంగా సోమవారం నాడు ఆలయ అధికారులు సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు.
Read Also: Rains-Trains: వర్షాల ప్రభావం.. రేపటి వరకు పలు రైళ్ల రద్దు
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
భక్తులకు విద్యుత్, శానిటేషన్, మంచినీటి వసతి కల్పిస్తున్నామని సింహాచలం ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 32 కిలోమీటర్ల మేర 30 స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. 4వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించామని తెలిపారు. వర్షాలు పడుతున్న కారణంగా గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వెంట గొడుగు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. గిరి ప్రదక్షిణల సందర్భంగా సింహాచలం కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదన్నారు. 30 ఆర్టీసీ బస్సులను భక్తుల రాకపోకల కోసం కేటాయించామన్నారు. లుంబినీ పార్కు, తెన్నేటి పార్క్ సముద్రంలో స్నానాలు చేసే భక్తుల భద్రత కోసం గజఈతగాళ్లను నియమించామని పేర్కొన్నారు.
అటు అప్పుఘర్ సముద్రంలో భక్తులు స్నానాలు చేసే చోట మూడు ఎన్డీఆర్ఎఫ్, మెరైన్ పోలీసు బృందాలు విధుల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. జోడుగుళ్ల పాలెం సముద్రంలో ప్రమాదాలు జరుగుతున్నందున భక్తుల స్నానాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రెస్క్యూ కోసం బోట్లను అందుబాటులో ఉంచుతున్నామని.. గిరిప్రదక్షిణ ట్రాఫిక్, లా&ఆర్డర్ కోసం 2వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!