Andhra Pradesh: నేటి నుంచి సింహాచలంలో గిరి ప్రదక్షిణలు.. 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం పుణ్యక్షేత్రంలో నేటి నుంచి సింహగిరి ప్రదక్షిణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కొండ చుట్టూ 32 కి.మీ.మేర భక్తులు ప్రదక్షిణ చేస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఈ గిరి ప్రదక్షిణలో దాదాపు 4 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. వారికి ఇబ్బంది కలగకుండా అధికారులు పలు చోట్ల మంచినీరు, మెడికల్ క్యాంపులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవస్థాన ప్రచార రథం ప్రారంభమవుతుంది. గిరి ప్రదక్షిణ సందర్భంగా సోమవారం నాడు ఆలయ అధికారులు సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు.
Read Also: Rains-Trains: వర్షాల ప్రభావం.. రేపటి వరకు పలు రైళ్ల రద్దు
Also Read
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
భక్తులకు విద్యుత్, శానిటేషన్, మంచినీటి వసతి కల్పిస్తున్నామని సింహాచలం ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 32 కిలోమీటర్ల మేర 30 స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. 4వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించామని తెలిపారు. వర్షాలు పడుతున్న కారణంగా గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వెంట గొడుగు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. గిరి ప్రదక్షిణల సందర్భంగా సింహాచలం కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదన్నారు. 30 ఆర్టీసీ బస్సులను భక్తుల రాకపోకల కోసం కేటాయించామన్నారు. లుంబినీ పార్కు, తెన్నేటి పార్క్ సముద్రంలో స్నానాలు చేసే భక్తుల భద్రత కోసం గజఈతగాళ్లను నియమించామని పేర్కొన్నారు.
అటు అప్పుఘర్ సముద్రంలో భక్తులు స్నానాలు చేసే చోట మూడు ఎన్డీఆర్ఎఫ్, మెరైన్ పోలీసు బృందాలు విధుల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. జోడుగుళ్ల పాలెం సముద్రంలో ప్రమాదాలు జరుగుతున్నందున భక్తుల స్నానాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రెస్క్యూ కోసం బోట్లను అందుబాటులో ఉంచుతున్నామని.. గిరిప్రదక్షిణ ట్రాఫిక్, లా&ఆర్డర్ కోసం 2వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!