MP Santosh Kumar : ప్రతిష్టాత్మక ‘వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్’ అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రతిష్టాత్మక “వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డు వరించింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోలీహిమ్ పాల్గొని మొక్కలు నాటారు. “ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా దేశవిదేశాల్లో మొక్కలు నాటిన నా వృక్ష ప్రేమికులందరిది అన్నారు రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్”
రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న “వృక్ష మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డుల ప్రధానోత్సవంలో “ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్” మరియు “ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబా” చేతుల మీదుగా వృక్షమిత్ర అవార్డు అందుకోవాల్సిన సంతోష్ కుమార్.. అధికారిక కార్యక్రమాల వల్ల అందుబాటులో లేని కారణంగా.. ఆయనకు బదులుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” రాఘవ, మర్ది కరుణాకర్ రెడ్డి అవార్డును స్వీకరించారు.
Also Read
అవార్డు వేడుకకు అందుబాటులో లేని కారణంగా, తన సందేశం పంపించిన సంతోష్ కుమార్, తనను అవార్డుకు నామినేట్ చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. పచ్చని ప్రకృతి కోసం మేం చేస్తున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమానికి అనేక అవార్డులు ప్రశంసలు దక్కాయి. కానీ ఇది అన్నింటికంటే ప్రత్యేకమైనదని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆరవ పర్యవరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అనేక పర్యవరణహిత కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ప్రకృతి ప్రేమికుడు ఎరిక్ సోలిమ్, అదేవిధంగా ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన విష్ణులాంబ చేతులమీదుగా అవార్డు అందుకోవడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ఎక్కడలేని ఎనర్జీని అందించిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?