Komatireddy Venkatreddy : రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్కి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులకు కరెంట్ కోతలు విధించటం ఎరువుల ధరలు పెంచటం లాంటి పలు రైతాంగ సమస్యలను మీ దృష్టి కి ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. రైతు లేనిది రాజ్యం లేదు ఒక రైతు ఆరు నెలలు కష్టపడితేనే మనం అన్నం తింటాం నెలతల్లిని నమ్ముకుని కష్టపడి బ్రతికే రైతన్నలకు ప్రభుత్వాలు చేయుతనివ్వాలి కానీ వారికి భారంగా మారకూడదు.
ఇప్పటికే వడ్లు కొనుగోలు విషయంలో రైతులు గందరగోళం లో ఉన్నారు ఈ పరిస్థుల్లో కరెంట్ కోతలు విధించి రైతులను ఇంకా బాదపెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం…ఈ కోతలతో చేతికొచ్చిన పంట నీరు అందక ఎండిపోతుంటే రైతు కళ్లలో నుండి కన్నీరు కారుతుంది. పట్టణ ప్రాంతాలకు 24 గంటలు కరెంట్ ఇస్తూ రైతులకు కోతలు విధించటం సబబు కాదు అవసరం అనుకుంటే పట్టణ ప్రాంతంలో 2 గంటలు కోత విధించి రైతాంగానికి మేలు చేయండి.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజు వారీగా 35 మిలియన్ యూనిట్లు రికార్డ్ కాగా 5 మిలియన్ యూనిట్లు కోత విధించారు. ఇలా కోతలు విధించటం మూలన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు..రైతులను 24 గంటల కరెంట్ కి అలవాటు చేసి ఇలా పంట చేతికొచ్చే సమయంలో కోతలు విధించడం ఏంటి..? మరో వైపు ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి విపరీతంగా రేట్లు పెంచటం వలన రైతులకు ఎరువులు పెను భారంగా మారాయి….266 వందలు ఉన్న యూరియా పై 50 రూపాయలు పెంచారు అలాగే 28-28-28 మరియు 17-17-17 ఇంకా 14 – 13- 14 ఎరువులు 1474 ఉండగా 1900 చేసి ఏకంగా 425 రూపాయలు పెంచారు..అలాగే పోటాష్ ధర 885 ఉండగా 1700 చేసి ఒకేసారి 815 రూపాయలు పెంచారు. ఇలా ఓ వైపు ఎరువుల ధరలు పెంచుతూ కరెంట్ కోతలు విధిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నేలతల్లి ని నమ్ముకుని బ్రతుకున్న రైతన్నలు ఇలా వేదించటం సరికాదు రైతన్నలు ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై ఇలా కక్ష సాధించడం న్యాయం కాదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!