Modiji Kutch GST Hojaye: మోదీజీ కుచ్ జీఎస్టీ హోజాయే..! నగరంలో వెలసిన ఫ్లెక్సీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యావసర సరకులపై.. మరీ ముఖ్యంగా పిల్లలకు పౌష్టిక ఆహారం పై పాలు, అనుబంధ ఉత్పత్తులపై ఏమాత్రం ఆలోచన లేకుండా కేంద్రం జీఎస్టీ విధించడంపై ప్రజలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోజురోజుకూ ధరల భారం మోపుతున్న బీజేపీ సర్కారు తీరుపై జనం మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో.. పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ కంటోన్మెంట్లోని టివోలి చౌరస్తా వద్ద ‘మోదీజీ కుచ్ జీఎస్టీ హోజాయే’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో చర్చనీయాంశకంగా మారింది. మొన్నటి వరకు గ్యాస్పై వున్న ప్లేక్సీలు దర్శనమివ్వగా.. నేడు పాలపై ప్లెక్సీలు దర్శనమివ్వడంతో.. ఇది వార్త కాస్తా సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లలకు కనీసం పాలు కూడా లేకుండా చేస్తారా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. అయితే.. అంత్యక్రియల సేవలపైనా కేంద్రం జీఎస్టీని విధించడంతో, చచ్చిన తర్వాత కూడా జీఎస్టీ కట్టాలా..? అంటూ జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
అయితే కొందరు చిరువ్యాపారులు పనిచేసుకుంటేనే బ్రతికేటోళ్లమని, ప్రతి వస్తువుపై ట్యాక్స్లు పెంచడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదని, గ్యాస్ ధరలు పెంచి కట్టెలపొయ్యి పెట్టుకునే పరిస్థితికి దిగజార్చింది మోదీ ప్రభుత్వమంటూ మండిపడుతున్నారు. ఇంధనం ధరలు ఆకాశానికి అంటుతుంటే తినే వస్తులపైనా ధరలు పెంచి పేదోడి నడ్డి విరుస్తున్నారు చిరువ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అన్ని రకాల ధరలు చుక్కలనంటాయని, ఇక పాలు, పాల ఉత్పత్తులకు కూడా జీఎస్టీ విధిస్తే పేదలు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంత్రక్రియల సేవలపైనా పన్ను విధించి చచ్చినా సరే జీఎస్టీ కట్టాలనడం దురదృష్టకరమని ప్రజలు మండిపడుతున్నారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
Shivraj Singh Chouhan: క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మధ్యప్రదేశ్కు చెందినవారే..!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!