నిత్యావసర సరకులపై.. మరీ ముఖ్యంగా పిల్లలకు పౌష్టిక ఆహారం పై పాలు, అనుబంధ ఉత్పత్తులపై ఏమాత్రం ఆలోచన లేకుండా కేంద్రం జీఎస్టీ విధించడంపై ప్రజలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోజురోజుకూ ధరల భారం మోపుతున్న బీజేపీ సర్కారు తీరుపై జనం మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో.. పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ కంటోన్మెంట్లోని టివోలి చౌరస్తా వద్ద ‘మోదీజీ కుచ్ జీఎస్టీ హోజాయే’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో చర్చనీయాంశకంగా మారింది. మొన్నటి వరకు…
హైదరాబాద్లో ఫ్లెక్సీల పరంపర కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ఇవి వెలుస్తుండటం గమనార్హం. ఇటీవల కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పీఎం మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయన దేశాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలతో కూడిన ఫ్లెక్సీలు రాత్రికిరాత్రే ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బ్యానర్లు కట్టారు. ఇంటి అవసరాలకు వాడుకునే ఎల్పీజీ…