MMTS Trains: ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం పాటు 16 సర్వీసులు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MMTS Trains: హైదరాబాద్లోని MMTS రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక. దక్షిణ మధ్య రైల్వే అధికారులు వారం పాటు 16 సర్వీసులను రద్దు చేశారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు 16 సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. వాజానగర్ నుండి లింగంపల్లికి వెళ్లే రైలు నంబర్ 47165 సమయం మార్చబడింది. ఈ రైలు ఈ వారం వాజా నగర్ నుండి ఉదయం 8.50 గంటలకు బయలుదేరుతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల్లో హైదరాబాద్-లింగంపల్లి మధ్య 10 రైళ్లు నడుస్తున్నాయి. లింగంపల్లి-ఫలక్నుమా మధ్య నడిచే మూడు రైళ్లు, వాజానగర్-లింగంపల్లి మధ్య నడిచే మూడు రైళ్లను రద్దు చేశారు. MMTS స్టేషన్లలో రద్దు చేయబడిన రైళ్ల సమయాలు మరియు క్యారేజీ నంబర్లను ప్రదర్శిస్తామని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్ రాకేష్ తెలిపారు.
Read also: Jawan: తమిళ డైరెక్టర్-హీరోయిన్-విలన్-మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా… కలెక్షన్స్ మాత్రం తెలుగులోనే ఎక్కువ
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
మరోవైపు కాజీపేట రైల్వే జంక్షన్లోని బలార్షా సెక్షన్లో మూడో లైన్ ఇంటర్లాకింగ్, నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఆగస్టు 29 నుంచి ఇంటర్సిటీ, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అనే రెండు రైళ్లను బెల్లంపల్లికి కుదించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 26 వరకు హైదరాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే ఇంటర్సిటీ రైలు, సికింద్రాబాద్-బలార్ష మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు సిర్పూర్ కాగజ్నగర్, రెండు ప్రధాన రైల్వే స్టేషన్లలో మూడవ లైన్ పనులు జరుగుతున్నందున బెల్లంపల్లికి కుదించబడినట్లు వెల్లడించారు. బెల్లంపల్లి-బలార్ష సెక్షన్ మూడో లైన్ పనులు పూర్తి కావస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు ఎలాంటి మార్పులు లేకుండా బెల్లంపల్లి వరకు మాత్రమే నడుస్తాయని వివరించారు. దీంతో పాటు గతంలో రద్దు చేసిన రామగిరి, సింగరేణి, డోర్నకల్ ప్యాసింజర్, కాకతీయ రైళ్ల రద్దును అక్టోబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
Jailer OTT: 600 కోట్ల సినిమా ఓవర్ రేటెడా? జైలర్ లో విషయం లేదా?
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!