MMTS Trains: ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం పాటు 16 సర్వీసులు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MMTS Trains: హైదరాబాద్లోని MMTS రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక. దక్షిణ మధ్య రైల్వే అధికారులు వారం పాటు 16 సర్వీసులను రద్దు చేశారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు 16 సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. వాజానగర్ నుండి లింగంపల్లికి వెళ్లే రైలు నంబర్ 47165 సమయం మార్చబడింది. ఈ రైలు ఈ వారం వాజా నగర్ నుండి ఉదయం 8.50 గంటలకు బయలుదేరుతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల్లో హైదరాబాద్-లింగంపల్లి మధ్య 10 రైళ్లు నడుస్తున్నాయి. లింగంపల్లి-ఫలక్నుమా మధ్య నడిచే మూడు రైళ్లు, వాజానగర్-లింగంపల్లి మధ్య నడిచే మూడు రైళ్లను రద్దు చేశారు. MMTS స్టేషన్లలో రద్దు చేయబడిన రైళ్ల సమయాలు మరియు క్యారేజీ నంబర్లను ప్రదర్శిస్తామని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్ రాకేష్ తెలిపారు.
Read also: Jawan: తమిళ డైరెక్టర్-హీరోయిన్-విలన్-మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా… కలెక్షన్స్ మాత్రం తెలుగులోనే ఎక్కువ
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
మరోవైపు కాజీపేట రైల్వే జంక్షన్లోని బలార్షా సెక్షన్లో మూడో లైన్ ఇంటర్లాకింగ్, నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఆగస్టు 29 నుంచి ఇంటర్సిటీ, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అనే రెండు రైళ్లను బెల్లంపల్లికి కుదించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 26 వరకు హైదరాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే ఇంటర్సిటీ రైలు, సికింద్రాబాద్-బలార్ష మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు సిర్పూర్ కాగజ్నగర్, రెండు ప్రధాన రైల్వే స్టేషన్లలో మూడవ లైన్ పనులు జరుగుతున్నందున బెల్లంపల్లికి కుదించబడినట్లు వెల్లడించారు. బెల్లంపల్లి-బలార్ష సెక్షన్ మూడో లైన్ పనులు పూర్తి కావస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు ఎలాంటి మార్పులు లేకుండా బెల్లంపల్లి వరకు మాత్రమే నడుస్తాయని వివరించారు. దీంతో పాటు గతంలో రద్దు చేసిన రామగిరి, సింగరేణి, డోర్నకల్ ప్యాసింజర్, కాకతీయ రైళ్ల రద్దును అక్టోబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
Jailer OTT: 600 కోట్ల సినిమా ఓవర్ రేటెడా? జైలర్ లో విషయం లేదా?
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..